ఇండియాకి అమెరికా టెస్ట్ కిట్లు.. వాటి ప్రత్యేకత ఇదే!

April 30, 2021 2:07 PM

ప్రస్తుతం కరోనా సంక్షోభంలో చిక్కుకున్న భారత దేశాన్ని కాపాడటం కోసం అమెరికా ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో భారతదేశాన్ని ఆదుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన కొద్ది రోజులలోనే భారత్ కి పెద్ద సహాయం చేశారు. ప్రస్తుతం కరోనా చికిత్సలో ఎంతో అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లు, ఎన్-95 మాస్కులు, ర్యాపిడ్ టెస్టు కిట్లు పంపిణీ చేయటానికి యూఎస్‌ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవెలప్‌మెంట్(యూఎస్ఏఐడీ) సిద్ధం చేసింది.

అమెరికా సహాయంలో భాగంగా పది లక్షల రాపిడ్ టెస్ట్ డయాగ్నస్టిక్ టెస్టు కిట్లు పంపనున్నట్లు వెల్లడించారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ఈ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించగా.. కేవలం 15 నిమిషాలలో ఎంతో స్పష్టమైన ఫలితాలు వెలువడ్డాయి. ఈ కిట్ల ప్రత్యేకత అదే . గత ఏడు సంవత్సరాల నుంచి భారత్ అమెరికా మధ్య సన్నిహిత సంబంధం ఉందని ఈ కోవిడ్ కష్టకాలంలో ఆ బంధం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు తెలిపాడు.

కరోనా మొదటి దశలో భారత్ నుంచి అమెరికా ఎంతో సహాయం పొందిందని,ఇప్పుడు ఇండియాకి కూడా సహాయం అవసరం కనుక తమ దేశం నుంచి ఇప్పటికే 23 మిలియన్ డాలర్ల సాయం చేసిందని, మరో 100 మిలియన్ డాలర్ల విలువైన వైద్య పరికరాలను అందజేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు తెలిపారు.
భారత్‌కి 1100 ఆక్సిజన్ సిలిండర్లు, 1700 మెడికల్ ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, ఒక్కోటి 20 మందికి ఉపయోగపడే ఆక్సిజన్ యూనిట్లు అందించనున్నట్లు తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment