దేశంలో కరోనా సెకండ్ వేవ్ సునామీలా విజృంభిస్తోంది. రోజూ 3.50 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. మొత్తం మరణాల సంఖ్య ఇప్పటికే 2 లక్షలు దాటింది. ఈ క్రమంలో కోవిడ్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇక భారీగా పెరుగుతున్న కోవిడ్ కేసుల వల్ల వైద్య రంగం సంక్షోభంలో పడేందుకు సిద్ధంగా ఉంది. అయినప్పటికీ వైద్య సిబ్బంది కోవిడ్ బాధితులను రక్షించేందుకు రోజుకు 24 గంటలూ శ్రమిస్తున్నారు.
కోవిడ్ బాధితులకు చికిత్స ఇస్తూ కొన్ని గంటల పాటు పీపీఈ కిట్లో ఉండి అత్యంత దయనీయ స్థితిలో ఉన్న ఓ డాక్టర్ ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో ఆ డాక్టర్ పూర్తిగా తడిసిపోయి ఉండడాన్ని గమనించవచ్చు. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తిని డాక్టర్ సోహిల్గా గుర్తించారు. ఏప్రిల్ 28 తేదీన ఆయన తన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్గా మారింది.
పీపీఈ కిట్లో 15 గంటల పాటు ఉన్న తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో ఆ డాక్టర్ వివరించారు. అంతటి దారుణమైన స్థితిని ఎదుర్కొంటూ కూడా కోవిడ్ బాధితులకు సేవ చేస్తున్నామని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. కోవిడ్ వ్యాప్తి చెందకుండా ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలను పాటించాలని, కోవిడ్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలంటే టీకా ఒక్కటే మార్గమని, ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని అన్నారు. కాగా ఆ డాక్టర్ పెట్టిన పోస్టుకు నెటిజన్లు స్పందిస్తున్నారు. తాము కోవిడ్ వారియర్లకు మద్దతుగా ఉంటామని తెలిపారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…