భార‌త‌దేశం

కేంద్ర మంత్రులతో మోదీ సమావేశం.. కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం..?

దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజుకు 3.50 లక్షలకు పైగా కోవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని, కోవిడ్‌ కట్టడికి చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే కరోనా సెకండ్‌ వేవ్‌ మరీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు ఈ విషయంపై కేంద్రాన్ని ప్రశ్నించింది. కోవిడ్‌ కట్టడికి ఏం చర్యలు తీసుకుంటున్నారని ఇటీవల అడిగింది. అందుకు కేంద్రం సమాధానం చెప్పింది. కానీ పరిస్థితి చేయి దాటినట్లు కనిపిస్తుండడంతో మోదీ కేంద్ర మంత్రులతో కేబినెట్‌ సమావేశం నిర్వహించనున్నారు.

ప్రధాని మోదీ శుక్రవారం కేంద్ర కేబినెట్‌ సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. దేశంలో కోవిడ్‌ పరిస్థితి, కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించనున్నారు. అయితే ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కోవిడ్‌ విజృంభిస్తుండడంతో కేంద్రం ముందు లాక్‌డౌన్‌ ఒక్కటే మార్గంగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రధాని మోదీ తాజాగా నిర్వహించిన మన్‌కీబాత్‌లో లాక్‌డౌన్‌ అనేది చివరి అస్త్రమని తెలిపారు. కోవిడ్‌ కేసుల సంఖ్య భారీగా నమోదవుతుండడంతో ఇక చివరి అస్త్రాన్ని ప్రయోగించడం ఒక్కటే మార్గమని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే లాక్‌డౌన్‌ ఉండదని పలువురు కేంద్ర మంత్రులు ఇప్పటికే పలుమార్లు చెప్పారు. అయినప్పటికీ పరిస్థితి చేయి దాటింది కనుక ఇక లాక్‌డౌన్‌ పెట్టడం తప్ప ఇంకో మార్గం లేదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మోదీ నిర్వహించనున్న ఈ సమావేశంలో లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటారా, లేదా కఠిన ఆంక్షలను అమలు చేయాలని రాష్ట్రాలకు చెబుతారా ? అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

పది పాసైతే చాలు.. ఆర్‌బీఐలో 572 ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు.. అప్లై చేయడానికి లింక్ ఇదే!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…

Tuesday, 27 January 2026, 2:59 PM

లోకేష్ కనగరాజ్‌పై ఫ్యాన్స్ ఫైర్.. ‘మీకు కలెక్షన్లే కావాలా.. కథ అక్కర్లేదా?’ అంటూ నెటిజన్ల ట్రోలింగ్!

ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…

Tuesday, 27 January 2026, 9:45 AM

మీ ఫోన్ స్లోగా చార్జ్ అవుతుందా? ఈ 5 చిట్కాలతో నిమిషాల్లో ఫుల్ చార్జింగ్!

నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…

Monday, 26 January 2026, 9:44 PM

అమెజాన్ ఉద్యోగులకు షాక్.. రేపటి నుంచి 16 వేల మంది తొలగింపు? భారత్‌పైనే ఆ ప్రభావం ఎక్కువ!

అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…

Monday, 26 January 2026, 7:45 PM

తెలంగాణలో వచ్చేది మా ప్రభుత్వమే.. 2028లో జాగృతి పార్టీ విజయం ఖాయం: కవిత సంచలన వ్యాఖ్యలు

పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…

Monday, 26 January 2026, 5:34 PM

మెగా సక్సెస్.. మెగా గిఫ్ట్! దర్శకుడు అనిల్ రావిపూడికి రూ. 1.40 కోట్ల ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి!

అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…

Monday, 26 January 2026, 1:38 PM

గూగుల్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్స్.. డిగ్రీ, పీజీ విద్యార్థులకు అదిరిపోయే అవకాశం! అప్లికేషన్ ప్రాసెస్ ఇదే..

ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…

Monday, 26 January 2026, 10:41 AM

ఇస్రోలో భారీ నియామకాలు.. నెలకు రూ. 2.08 లక్షల జీతం! ఇంజనీరింగ్, సైన్స్ గ్రాడ్యుయేట్లకు గోల్డెన్ ఛాన్స్..

ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…

Sunday, 25 January 2026, 5:28 PM