దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజుకు 3.50 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని, కోవిడ్ కట్టడికి చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే కరోనా సెకండ్ వేవ్ మరీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ను అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు ఈ విషయంపై కేంద్రాన్ని ప్రశ్నించింది. కోవిడ్ కట్టడికి ఏం చర్యలు తీసుకుంటున్నారని ఇటీవల అడిగింది. అందుకు కేంద్రం సమాధానం చెప్పింది. కానీ పరిస్థితి చేయి దాటినట్లు కనిపిస్తుండడంతో మోదీ కేంద్ర మంత్రులతో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు.
ప్రధాని మోదీ శుక్రవారం కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. దేశంలో కోవిడ్ పరిస్థితి, కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించనున్నారు. అయితే ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కోవిడ్ విజృంభిస్తుండడంతో కేంద్రం ముందు లాక్డౌన్ ఒక్కటే మార్గంగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రధాని మోదీ తాజాగా నిర్వహించిన మన్కీబాత్లో లాక్డౌన్ అనేది చివరి అస్త్రమని తెలిపారు. కోవిడ్ కేసుల సంఖ్య భారీగా నమోదవుతుండడంతో ఇక చివరి అస్త్రాన్ని ప్రయోగించడం ఒక్కటే మార్గమని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే లాక్డౌన్ ఉండదని పలువురు కేంద్ర మంత్రులు ఇప్పటికే పలుమార్లు చెప్పారు. అయినప్పటికీ పరిస్థితి చేయి దాటింది కనుక ఇక లాక్డౌన్ పెట్టడం తప్ప ఇంకో మార్గం లేదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మోదీ నిర్వహించనున్న ఈ సమావేశంలో లాక్డౌన్పై నిర్ణయం తీసుకుంటారా, లేదా కఠిన ఆంక్షలను అమలు చేయాలని రాష్ట్రాలకు చెబుతారా ? అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…