దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజుకు 3.50 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని, కోవిడ్ కట్టడికి చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే కరోనా సెకండ్ వేవ్ మరీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ను అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు ఈ విషయంపై కేంద్రాన్ని ప్రశ్నించింది. కోవిడ్ కట్టడికి ఏం చర్యలు తీసుకుంటున్నారని ఇటీవల అడిగింది. అందుకు కేంద్రం సమాధానం చెప్పింది. కానీ పరిస్థితి చేయి దాటినట్లు కనిపిస్తుండడంతో మోదీ కేంద్ర మంత్రులతో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు.
ప్రధాని మోదీ శుక్రవారం కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. దేశంలో కోవిడ్ పరిస్థితి, కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించనున్నారు. అయితే ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కోవిడ్ విజృంభిస్తుండడంతో కేంద్రం ముందు లాక్డౌన్ ఒక్కటే మార్గంగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రధాని మోదీ తాజాగా నిర్వహించిన మన్కీబాత్లో లాక్డౌన్ అనేది చివరి అస్త్రమని తెలిపారు. కోవిడ్ కేసుల సంఖ్య భారీగా నమోదవుతుండడంతో ఇక చివరి అస్త్రాన్ని ప్రయోగించడం ఒక్కటే మార్గమని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే లాక్డౌన్ ఉండదని పలువురు కేంద్ర మంత్రులు ఇప్పటికే పలుమార్లు చెప్పారు. అయినప్పటికీ పరిస్థితి చేయి దాటింది కనుక ఇక లాక్డౌన్ పెట్టడం తప్ప ఇంకో మార్గం లేదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మోదీ నిర్వహించనున్న ఈ సమావేశంలో లాక్డౌన్పై నిర్ణయం తీసుకుంటారా, లేదా కఠిన ఆంక్షలను అమలు చేయాలని రాష్ట్రాలకు చెబుతారా ? అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…