భార‌త‌దేశం

దారుణం.. రైలులో అండర్‌వేర్‌తో ప్రయాణించిన ఎమ్మెల్యే.. తోటి ప్రయాణికులపై బెదిరింపులు.. కేసు నమోదు..

బీహార్‌కు చెందిన జేడీయూ ఎమ్మెల్యే గోపాల్‌ మండల్‌పై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన రైలులో అండర్‌వేర్‌తో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించడమే కాకుండా వారిపై బెదిరింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే ఓ ప్రయాణికుడికి చెందిన బంగారు ఆభరణాలు, నగదును కూడా ఆయన లాక్కున్నారని ప్రయాణికులు ఆరోపించారు. దీంతో రైల్వే పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..

బీహార్‌ జేడీయూ ఎమ్మెల్యే గోపాల్‌ మండల్‌ గురువారం పాట్నా నుంచి న్యూఢిల్లీకి తేజస్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరారు. ఆయనతోపాటు మరో ఇద్దరు కూడా వెంట ఉన్నారు. ఈ క్రమంలోనే వారు రైలులో సెకండ్‌ ఏసీ ఎ1 బోగీలో 13, 14, 15 నంబర్‌ బెర్తుల్లో ప్రయాణిస్తున్నారు.

అయితే రైలు ఉత్తరప్రదేశ్‌లోని దిల్దార్‌నగర్‌ స్టేషన్‌ను దాటిన తరువాత ఎమ్మెల్యే గోపాల్‌ మండల్‌ షర్ట్‌, ప్యాంట్‌ విప్పి కేవలం బన్నీను, అండర్‌వేర్‌ తో రైలులో చాలా సేపు ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రవర్తన పట్ల తోటి ప్రయాణికులు అభ్యంతరం చెప్పగా వారిపై ఆయన బెదిరింపులకు పాల్పడ్డారు. కాగా ఓ ప్రయాణికుడు ధైర్యం చేసి ఆయన్ను ప్రశ్నించగా అతని నుంచి బంగారు చెయిన్‌, ఉంగరం, డబ్బును ఎమ్మెల్యే లాక్కున్నారు.

ఈ క్రమంలో ఆ ప్రయాణికుడు రైల్వే పోలీసులకు పై విషయాలను తెలియజేస్తూ ఫిర్యాదు చేశాడు. అంతేకాదు ఆ సమయంలో ఆ ఎమ్మెల్యే మద్యం మత్తులో ఉన్నాడని కూడా ఆ ప్రయాణికుడు తెలిపాడు. తమను బెదిరించడమే కాకుండా, తన దగ్గర ఉన్న బంగారం, నగదును ఎమ్మెల్యే లాక్కున్నాడని ఆ ప్రయాణికుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే గోపాల్‌ మండల్‌పై కేసు నమోదు చేశారు. ఆ కేసును బీహార్‌లోని బక్సర్‌కు బదిలీ చేశారు.

కాగా ఆ ఎమ్మెల్యే అలా రైలులో తిరుగుతున్నప్పుడు తీసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో అతని ప్రవర్తన పట్ల నెటిజన్లు అసహ్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఇలా నీచంగా ప్రవర్తించాడని విమర్శిస్తున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అయితే ఈ విషయంపై సదరు ఎమ్మెల్యే గోపాల్‌ మండల్‌ స్పందిస్తూ.. తనకు ప్రయాణంలో విరేచనాలు అయ్యాయని, అందుకనే అలా అండర్‌వేర్‌లో ఉండాల్సి వచ్చిందని చెప్పారు. కానీ ప్రయాణికులందరూ ముక్త కంఠంతో ఆయనపై ఆరోపణలు చేశారు. తమపై ఆయన బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM