బీహార్కు చెందిన జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్పై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన రైలులో అండర్వేర్తో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించడమే కాకుండా వారిపై బెదిరింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే ఓ ప్రయాణికుడికి చెందిన బంగారు ఆభరణాలు, నగదును కూడా ఆయన లాక్కున్నారని ప్రయాణికులు ఆరోపించారు. దీంతో రైల్వే పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..
బీహార్ జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ గురువారం పాట్నా నుంచి న్యూఢిల్లీకి తేజస్ రాజధాని ఎక్స్ప్రెస్లో బయల్దేరారు. ఆయనతోపాటు మరో ఇద్దరు కూడా వెంట ఉన్నారు. ఈ క్రమంలోనే వారు రైలులో సెకండ్ ఏసీ ఎ1 బోగీలో 13, 14, 15 నంబర్ బెర్తుల్లో ప్రయాణిస్తున్నారు.
అయితే రైలు ఉత్తరప్రదేశ్లోని దిల్దార్నగర్ స్టేషన్ను దాటిన తరువాత ఎమ్మెల్యే గోపాల్ మండల్ షర్ట్, ప్యాంట్ విప్పి కేవలం బన్నీను, అండర్వేర్ తో రైలులో చాలా సేపు ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రవర్తన పట్ల తోటి ప్రయాణికులు అభ్యంతరం చెప్పగా వారిపై ఆయన బెదిరింపులకు పాల్పడ్డారు. కాగా ఓ ప్రయాణికుడు ధైర్యం చేసి ఆయన్ను ప్రశ్నించగా అతని నుంచి బంగారు చెయిన్, ఉంగరం, డబ్బును ఎమ్మెల్యే లాక్కున్నారు.
ఈ క్రమంలో ఆ ప్రయాణికుడు రైల్వే పోలీసులకు పై విషయాలను తెలియజేస్తూ ఫిర్యాదు చేశాడు. అంతేకాదు ఆ సమయంలో ఆ ఎమ్మెల్యే మద్యం మత్తులో ఉన్నాడని కూడా ఆ ప్రయాణికుడు తెలిపాడు. తమను బెదిరించడమే కాకుండా, తన దగ్గర ఉన్న బంగారం, నగదును ఎమ్మెల్యే లాక్కున్నాడని ఆ ప్రయాణికుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే గోపాల్ మండల్పై కేసు నమోదు చేశారు. ఆ కేసును బీహార్లోని బక్సర్కు బదిలీ చేశారు.
కాగా ఆ ఎమ్మెల్యే అలా రైలులో తిరుగుతున్నప్పుడు తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అతని ప్రవర్తన పట్ల నెటిజన్లు అసహ్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఇలా నీచంగా ప్రవర్తించాడని విమర్శిస్తున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఈ విషయంపై సదరు ఎమ్మెల్యే గోపాల్ మండల్ స్పందిస్తూ.. తనకు ప్రయాణంలో విరేచనాలు అయ్యాయని, అందుకనే అలా అండర్వేర్లో ఉండాల్సి వచ్చిందని చెప్పారు. కానీ ప్రయాణికులందరూ ముక్త కంఠంతో ఆయనపై ఆరోపణలు చేశారు. తమపై ఆయన బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…