సాధారణంగా ఎవరైనా గొడవ పడుతుంటే కొందరు వ్యక్తులు ఆ గొడవ మధ్యలో జోక్యం చేసుకొని ఆ గొడవను అంతటితో ఆపే ప్రయత్నం చేస్తారు. మరికొందరు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం ఎందుకంటూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. అయితే ఓ వ్యక్తి భార్య భర్తల మధ్య జరుగుతున్న గొడవలోకి దూరి ఆ గొడవను ఆపే ప్రయత్నం చేశాడు. కానీ ఆ గొడవను ఆపడానికి వెళ్లిన ఆ వ్యక్తి వారి చేతిలో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే..
గుంటూరు నగరంలోని మంగళదాస్నగర్లో నివాసముంటున్న గోగులపాటి బెన్ని మద్యానికి బానిసగా మారి తరచూ తన భార్యను ఎన్నో చిత్రహింసలకు గురిచేసేవాడు. ఈ క్రమంలోనే ప్రతిరోజు తాగివచ్చి తన భార్యతో గొడవ పడగా తన భార్య మద్యం మానేయాలని నచ్చజెప్పే ప్రయత్నం చేసేది. ఈ క్రమంలోనే రాత్రి బెన్నీ బాగా తాగి వచ్చి తన భార్యను కొడుతున్న క్రమంలో సమీప బంధువు శ్యాంసన, పక్కనే ఉన్న ఏచూరి సత్యనారాయణ వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
కాగా బెన్నీ కుమారుడు జానా.. మా గొడవ మధ్యలో మీ జోక్యం ఏంటి అంటూ వారిపై ఎదురుదాడికి దిగాడు. ఈ క్రమంలోనే వారి మధ్య మాటా మాటా పెరగడంతో ఫుల్లుగా మద్యం మత్తులో ఉన్న బెన్నీ ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకువచ్చి సత్యనారాయణ పై దాడి చేశాడు. ఈ క్రమంలోనే అతనికి తీవ్ర గాయాలు కాగా అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించుకున్న తర్వాత అతన్ని ఇంటికి తీసుకురాగా అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించి మరణించాడు. కాగా హత్యకు పాల్పడిన బెన్నితోపాటు అతని కుమారుడు జానాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…