సాధారణంగా ఎవరైనా గొడవ పడుతుంటే కొందరు వ్యక్తులు ఆ గొడవ మధ్యలో జోక్యం చేసుకొని ఆ గొడవను అంతటితో ఆపే ప్రయత్నం చేస్తారు. మరికొందరు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం ఎందుకంటూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. అయితే ఓ వ్యక్తి భార్య భర్తల మధ్య జరుగుతున్న గొడవలోకి దూరి ఆ గొడవను ఆపే ప్రయత్నం చేశాడు. కానీ ఆ గొడవను ఆపడానికి వెళ్లిన ఆ వ్యక్తి వారి చేతిలో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే..
గుంటూరు నగరంలోని మంగళదాస్నగర్లో నివాసముంటున్న గోగులపాటి బెన్ని మద్యానికి బానిసగా మారి తరచూ తన భార్యను ఎన్నో చిత్రహింసలకు గురిచేసేవాడు. ఈ క్రమంలోనే ప్రతిరోజు తాగివచ్చి తన భార్యతో గొడవ పడగా తన భార్య మద్యం మానేయాలని నచ్చజెప్పే ప్రయత్నం చేసేది. ఈ క్రమంలోనే రాత్రి బెన్నీ బాగా తాగి వచ్చి తన భార్యను కొడుతున్న క్రమంలో సమీప బంధువు శ్యాంసన, పక్కనే ఉన్న ఏచూరి సత్యనారాయణ వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
కాగా బెన్నీ కుమారుడు జానా.. మా గొడవ మధ్యలో మీ జోక్యం ఏంటి అంటూ వారిపై ఎదురుదాడికి దిగాడు. ఈ క్రమంలోనే వారి మధ్య మాటా మాటా పెరగడంతో ఫుల్లుగా మద్యం మత్తులో ఉన్న బెన్నీ ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకువచ్చి సత్యనారాయణ పై దాడి చేశాడు. ఈ క్రమంలోనే అతనికి తీవ్ర గాయాలు కాగా అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించుకున్న తర్వాత అతన్ని ఇంటికి తీసుకురాగా అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించి మరణించాడు. కాగా హత్యకు పాల్పడిన బెన్నితోపాటు అతని కుమారుడు జానాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…