కరోనా కారణంగా భారత్లో జరగాల్సిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 ను యూఏఈలో నిర్వహిస్తున్న విషయం విదితమే. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14వ తేదీ వరకు ఆ టోర్నీ జరగనుంది. దీంతో ఆ టోర్నీలో జరగనున్న భారత్, పాకిస్థాన్పై ఇప్పటి నుంచే అందరూ రకరకాలుగా స్పందిస్తున్నారు.
టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా అక్టోబర్ 24న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్లు తలపడనున్నాయి. దుబాయ్లో ఈ మ్యాచ్ జరగనుంది. దీంతో అందరూ ఆ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాక్తో సంబంధాలు దెబ్బ తిన్నాక ఆ దేశం మన దగ్గర, మన వాళ్లు అక్కడ మ్యాచ్లను ఆడడం లేదు. కేవలం ఐసీసీ టోర్నమెంట్లలోనే పాక్తో భారత్ ఆడుతోంది. అయితే త్వరలో మరో ఐసీసీ ఈవెంట్లో ఈ రెండు దేశాలూ తలపడనుండడంతో అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఆ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు.
ఇక ఇదే విషయమై పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ స్పందిస్తూ.. ఈసారి టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భారత్పై కచ్చితంగా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశాడు. భారత్పై పైచేయి సాధిస్తామన్నాడు. అక్టోబర్ 24న జరిగే మ్యాచ్లో భారత్ను ఓడిస్తామని అన్నాడు.
అయితే భారత అభిమానులు మాత్రం బాబర్ అజమ్ కామెంట్లను లైట్ తీసుకుంటున్నారు. భారత్ ను ఓడించడం మీ వల్ల కాదని, బాబర్ అజమ్ మరీ ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…