ట్విట్టర్ యూజర్లకు ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో దిగ్గజ సంస్థ అయిన ట్విట్టర్ తమ యూజర్లకు శుభవార్తను తెలిపింది. ఇకపై ట్విట్టర్ వాడే ప్రతి ఒక్కరూ ఈ సరికొత్త ఫీచర్ ద్వారా నెల నెలా డబ్బులు సంపాదించవచ్చు. ట్విట్టర్ సూపర్ ఫాలోస్ అనే సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకు రావడంతో యూజర్లు ఈ ఫీచర్ ద్వారా నెల నెలా ఆదాయం పొందవచ్చు.
ట్విట్టర్ వాడే యూజర్లు కంటెంట్ షేరింగ్ చేస్తూ డబ్బును సంపాదించవచ్చు. సాధారణ యూజర్లు, జర్నలిస్టులు, క్రీడాకారులు, స్కిన్ కేర్ బ్యూటీ ఎక్స్పర్ట్స్, జ్యోతిష్య ప్రియులు, సంగీత కళాకారులు, క్రీడా నిపుణులు మొదలైనవారు ఈ సరికొత్త ఫీచర్ ద్వారా కంటెంట్ ను క్రియేట్ చేసి ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తే డబ్బులు సంపాదించవచ్చని తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్ కేవలం అమెరికా, కెనడాలో కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఇతర దేశాల్లోని యూజర్లకు కూడా ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ట్విట్టర్ ప్రతినిధులు పేర్కొన్నారు.
ఈ ఫీచర్ కోసం అప్లై చేయాలంటే కొన్ని అర్హతలను కూడా కలిగి ఉండాలి. 18 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే ఈ ఫీచర్ కోసం అప్లై చేయాలి. అదేవిధంగా ట్విట్టర్లో కనీసం పదివేల మంది ఫాలోవర్స్ ను కలిగి ఉండాలి. నెలకు కనీసం 25 సార్లు ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేస్తూ ఉండాలి. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు 2.99, 4.99, 9.99 డాలర్లతో ప్రతి నెలా సబ్స్క్రిప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది.
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్కు ముందు ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…