బీహార్లోని ఖగారియా జిల్లాలో వింతైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బ్యాంకు అకౌంట్లో ఆ బ్యాంక్ సిబ్బంది పొరపాటున కొన్ని లక్షల రూపాయలను జమ చేశారు. అయితే ఆ వ్యక్తి మాత్రం వాటిని ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో పోలీసులు కలగజేసుకోక తప్పలేదు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
బీహార్లోని ఖగారియా జిల్లా భక్తియార్పూర్ గ్రామానికి చెందిన రంజిత్ దాస్కు అక్కడి గ్రామీణ్ బ్యాంకులో అకౌంట్ ఉంది. అయితే అతని అకౌంట్లో ఆ బ్యాంకు సిబ్బంది పొరపాటున రూ.5.50 లక్షలను వేశారు. దీంతో తప్పు జరిగిందని తెలుసుకుని ఆ మొత్తాన్ని రికవరీ చేసేందుకు యత్నించారు. కానీ అప్పటికే ఆ వ్యక్తి ఆ మొత్తాన్ని తీసి వాడుకున్నాడు.
బ్యాంకు వారు ఆ మొత్తం తిరిగి ఇవ్వాలని, పొరపాటున పడిందని ఎంత చెప్పినా అతను వినలేదు. ప్రధాని మోదీ ప్రతి ఒక్కరి బ్యాంకు అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తారని చెప్పారని, అందులో భాగంగా మొదటి ఇన్స్టాల్ మెంట్ కింద ఆ మొత్తాన్ని వేశారని అతను బ్యాంకు వాళ్లకు చెప్పాడు. అంతేకాదు, ఆ మొత్తాన్ని బ్యాంకు వారు రికవరీ చేసేలోగానే అతను విత్డ్రా చేసేశాడు. అడిగితే ఖర్చు పెట్టానన్నాడు. దీంతో పోలీసులకు బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేయగా.. వారు రంజిత్ దాస్ను అరెస్టు చేశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్ను ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…