బీహార్లోని ఖగారియా జిల్లాలో వింతైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బ్యాంకు అకౌంట్లో ఆ బ్యాంక్ సిబ్బంది పొరపాటున కొన్ని లక్షల రూపాయలను జమ చేశారు. అయితే ఆ వ్యక్తి మాత్రం వాటిని ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో పోలీసులు కలగజేసుకోక తప్పలేదు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
బీహార్లోని ఖగారియా జిల్లా భక్తియార్పూర్ గ్రామానికి చెందిన రంజిత్ దాస్కు అక్కడి గ్రామీణ్ బ్యాంకులో అకౌంట్ ఉంది. అయితే అతని అకౌంట్లో ఆ బ్యాంకు సిబ్బంది పొరపాటున రూ.5.50 లక్షలను వేశారు. దీంతో తప్పు జరిగిందని తెలుసుకుని ఆ మొత్తాన్ని రికవరీ చేసేందుకు యత్నించారు. కానీ అప్పటికే ఆ వ్యక్తి ఆ మొత్తాన్ని తీసి వాడుకున్నాడు.
బ్యాంకు వారు ఆ మొత్తం తిరిగి ఇవ్వాలని, పొరపాటున పడిందని ఎంత చెప్పినా అతను వినలేదు. ప్రధాని మోదీ ప్రతి ఒక్కరి బ్యాంకు అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తారని చెప్పారని, అందులో భాగంగా మొదటి ఇన్స్టాల్ మెంట్ కింద ఆ మొత్తాన్ని వేశారని అతను బ్యాంకు వాళ్లకు చెప్పాడు. అంతేకాదు, ఆ మొత్తాన్ని బ్యాంకు వారు రికవరీ చేసేలోగానే అతను విత్డ్రా చేసేశాడు. అడిగితే ఖర్చు పెట్టానన్నాడు. దీంతో పోలీసులకు బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేయగా.. వారు రంజిత్ దాస్ను అరెస్టు చేశారు.
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…
నటీనటులు డబ్బు బాగా సంపాదించడం ఒకెత్తు అయితే దాన్ని పొదుపు చేయడం మరో ఎత్తు అని, సరైన సమయంలో డబ్బును…
View Comments
Tirigi dabbulu bank variki Ivvale