తనకు ఆరోగ్యం బాగా లేదని తన యజమానికి చెప్పడమే తన పాలిట తన కుటుంబం పాలిట శాపంగా మారింది. తన యజమాని చెప్పిన పని నిరాకరించినందుకే కోపంతో యజమాని తన భార్య పిల్లలను కిడ్నాప్ చేసి భార్య పట్ల ఎంతో అమానుషంగా ప్రవర్తించిన ఘటన మధ్యప్రదేశ్లో ఛతర్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
ఛతర్పూర్ జిల్లాలో ఓ గ్రామంలోని భూస్వామి తన పొలంలో ఉన్న చెట్లను నరికి వేయడానికి దళిత కార్మికుడిని నియమించుకున్నాడు. అయితే అతనికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆ పని చేయడానికి నిరాకరించాడు. పని ఒప్పుకొని చేయకపోవడంతో ఎంతో ఆగ్రహం వ్యక్తం చేసిన యజమాని ఆ దళితుడిపై వాగ్వాదానికి దిగాడు.ఈ క్రమంలోనే అతడు అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోగా అతని పై కోపం పెంచుకున్న యజమాని అతని ఇంటికి వెళ్లి తన భార్య పిల్లలు అతని తల్లిని కిడ్నాప్ చేయించాడు.
ఆ దళితుని భార్య గర్భవతి అని తెలిసినా కూడా ఏమాత్రం మానవత్వం లేకుండా ఆమెను కొట్టారు. నాలుగురోజుల పాటు వారిని బంధించిన యజమాని వారిని చిత్రహింసలకు గురిచేశారు.విషయం తెలిసిన జర్నలిస్ట్ పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసుల సహాయంతో వారి ఆచూకీని తెలుసుకుని గాయపడిన వారిని సరైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడి అరెస్టు చేసి అతనికి సహకరించిన మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తాజాగా ఈ ఘటనపై బాధితురాలు సంచలన వ్యాఖ్యలు చేసింది.సదరు యజమాని తన కొట్టడమే కాకుండా పిల్లల ఎదురుగానే తనపై లైంగికంగా దాడి చేశారని, ఆ విషయాన్ని పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేయలేదు అంటూ ఆరోపించింది. ఈ విషయంపై స్పందించిన పోలీసులు ఆమె కేవలం తనపై దాడి చేశారని, లైంగికంగా దాడి జరిగినట్లు తను పేర్కొనలేదని.. ఒకవేళ ఆమెపై లైంగికదాడి జరిగినట్టు చెబితే తప్పకుండా ఎఫ్ఐఆర్ లో నమోదు చేస్తామని ఛతర్పూర్ జిల్లా ఎస్పీ సచిన్ శర్మ తెలిపారు.
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్ను ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…