తనకు ఆరోగ్యం బాగా లేదని తన యజమానికి చెప్పడమే తన పాలిట తన కుటుంబం పాలిట శాపంగా మారింది. తన యజమాని చెప్పిన పని నిరాకరించినందుకే కోపంతో యజమాని తన భార్య పిల్లలను కిడ్నాప్ చేసి భార్య పట్ల ఎంతో అమానుషంగా ప్రవర్తించిన ఘటన మధ్యప్రదేశ్లో ఛతర్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
ఛతర్పూర్ జిల్లాలో ఓ గ్రామంలోని భూస్వామి తన పొలంలో ఉన్న చెట్లను నరికి వేయడానికి దళిత కార్మికుడిని నియమించుకున్నాడు. అయితే అతనికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆ పని చేయడానికి నిరాకరించాడు. పని ఒప్పుకొని చేయకపోవడంతో ఎంతో ఆగ్రహం వ్యక్తం చేసిన యజమాని ఆ దళితుడిపై వాగ్వాదానికి దిగాడు.ఈ క్రమంలోనే అతడు అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోగా అతని పై కోపం పెంచుకున్న యజమాని అతని ఇంటికి వెళ్లి తన భార్య పిల్లలు అతని తల్లిని కిడ్నాప్ చేయించాడు.
ఆ దళితుని భార్య గర్భవతి అని తెలిసినా కూడా ఏమాత్రం మానవత్వం లేకుండా ఆమెను కొట్టారు. నాలుగురోజుల పాటు వారిని బంధించిన యజమాని వారిని చిత్రహింసలకు గురిచేశారు.విషయం తెలిసిన జర్నలిస్ట్ పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసుల సహాయంతో వారి ఆచూకీని తెలుసుకుని గాయపడిన వారిని సరైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడి అరెస్టు చేసి అతనికి సహకరించిన మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తాజాగా ఈ ఘటనపై బాధితురాలు సంచలన వ్యాఖ్యలు చేసింది.సదరు యజమాని తన కొట్టడమే కాకుండా పిల్లల ఎదురుగానే తనపై లైంగికంగా దాడి చేశారని, ఆ విషయాన్ని పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేయలేదు అంటూ ఆరోపించింది. ఈ విషయంపై స్పందించిన పోలీసులు ఆమె కేవలం తనపై దాడి చేశారని, లైంగికంగా దాడి జరిగినట్లు తను పేర్కొనలేదని.. ఒకవేళ ఆమెపై లైంగికదాడి జరిగినట్టు చెబితే తప్పకుండా ఎఫ్ఐఆర్ లో నమోదు చేస్తామని ఛతర్పూర్ జిల్లా ఎస్పీ సచిన్ శర్మ తెలిపారు.
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…
నటీనటులు డబ్బు బాగా సంపాదించడం ఒకెత్తు అయితే దాన్ని పొదుపు చేయడం మరో ఎత్తు అని, సరైన సమయంలో డబ్బును…