చాలామంది చేపల పులుసు తినడానికి ఇష్టపడరు కానీ చేపల ఫ్రై అంటే చాలా ఇష్టపడతారు. మరి ఎంతో రుచికరమైన, నోరూరించే చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
*చేపలు 500 గ్రాములు
*అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్
*కార్న్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు
*ఒక టేబుల్ స్పూన్ శనగపిండి
*ఉప్పు టేబుల్ స్పూన్
*కారం టేబుల్ స్పూన్
*గరంమసాలా టేబుల్ స్పూన్
*నిమ్మకాయ ఒకటి
*పెరుగు చిన్నకప్పు
*ఫుడ్ కలర్ చిటికెడు
*నూనె
ముందుగా చేపలను శుభ్రంగా కడిగి మరీ పెద్ద సైజులో కాకుండా మోస్తరుగా కత్తిరించి పెట్టుకోవాలి. చేపముక్కలు చిన్నగా ఉన్నప్పుడే బాగా ఉప్పు, కారం పడతాయి. శుభ్రం చేసుకున్న చేపలను ఒక గిన్నెలో తీసుకొని వాటిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, ఉప్పు, శెనగపిండి, కార్న్ పౌడర్, గరం మసాల, పెరుగు వేసి బాగా కలపాలి. ఇందులోకి మనకు అవసరం అనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు లేకపోతే లేదు అది మీ ఇష్టం. అదేవిధంగా నిమ్మకాయ రసం వేసి,ఈ మిశ్రమం మొత్తం చేపముక్కలకు అంటుకునే విధంగా కలపాలి.ఈ విధంగా కలిపిన చేపల మిశ్రమాన్ని ఒక రెండు గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచుకోవాలి.
రెండు గంటల తర్వాత ఫ్రిజ్ నుంచి బయటకు తీసి పాన్ పై కొద్దిగా నూనె వేసి చేపముక్కలను చిన్న మంటపై అటూ ఇటూ కదిలిస్తూ చేప ముక్క ముదురు ఎరుపు రంగు వచ్చే వరకు వేయించాలి. ఈ విధంగా అన్ని ముక్కలు వేయించిన తర్వాత వీటిలోకి కొద్దిగా నిమ్మకాయ, ఉల్లిపాయను కలిపి తీసుకుంటే ఎంతో రుచికరమైన చేపల ఫ్రై తయారైనట్లే.
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం (మార్చి 11, 2026) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి…