ప్రతిరోజు చికెన్ తో ఒకేరకమైన వంటలు చేసుకొని తినాలి అంటే ఎంతో బోర్ గా అనిపిస్తుంది.అందుకోసమే ఈ రోజు ఎంతో వెరైటీగా కొత్తిమీర చికెన్ రోస్ట్ తయారు చేసుకోవడం ఎలానో తెలుసుకుందాం. కొత్తిమీర చికెన్ రోస్ట్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఇద్దరు రుచికరమైన కోతిమీర చికెన్ రోస్ట్ ఏవిధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
*చికెన్ 500 grams
*కారం పొడి టేబుల్ స్పూన్
*గరంమసాలా టేబుల్ స్పూన్
*అల్లం వెల్లుల్లి పేస్ట్ టేబుల్ స్పూన్
*పసుపు చిటికెడు
*నూనె
*ఉప్పు తగినంత
*కొత్తిమీర తురుము ఒక గుప్పెడు
ముందుగా ఒక గిన్నెలో చికెన్ ను కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి. శుభ్రంగా కడిగిన చికెన్ లోకి కారం పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కొత్తిమీర తురుము వేసి ఈ మిశ్రమం మొత్తం చికెన్ ముక్కలకు పట్టే విధంగా కలిపి పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గంట సమయం పాటు ఫ్రిజ్ లో పెట్టిన తర్వాత స్టౌ పై మరొక పాన్ ఉంచి కొద్దిగా నూనె వేసి నూనె వేడయ్యాక ముందుగా కలిపి పెట్టిన మిశ్రమం మొత్తం వేసి బాగా కలియబెట్టాలి. ఈ విధంగా చికెన్ మాడిపోకుండా మధ్యమధ్యలో కలుపుతూ చిన్నమంట పై బాగా ఉడికించాలి. ఈ విధంగా చికెన్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడిగా కొత్తిమీర చికెన్ రోస్ట్ తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది.
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం (మార్చి 11, 2026) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి…
నటి హన్సికా మోత్వాని, వ్యాపారవేత్త సోహైల్ కతూరియా నాలుగేళ్ల వివాహ జీవితానికి అధికారికంగా ముగింపు పలికారు. పరస్పర సమ్మతితో దాఖలు…