Huzurabad : హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్కు సర్వం సిద్ధం అయింది. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ప్రచారం అనంతరం పోలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలోనే గతంలోకన్నా 2 శాతం ఎక్కువగానే ఈ సారి హుజురాబాద్లో పోలింగ్ నమోదు అయింది. మొత్తం 86.33 పోలింగ్ శాతం నమోదైంది. దీంతో గెలుపు తమదంటే తమది అంటూ.. అభ్యర్థులు ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఈ క్రమంలో ఉప ఎన్నిక ఫలితంపై మరికొద్ది గంటల్లో ఉత్కంఠ వీడనుంది. 6 నెలల నుంచి జరిగిన రాజకీయ పోరాటంలో గెలుపు ఎవరిదో తేలిపోనుంది.
హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ లో ఓట్లను లెక్కించనున్నారు. ఇందుకు గాను 2 కౌంటింగ్ హాల్స్ ను ఏర్పాటు చేశారు. ముందుగా 753 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఈ క్రమంలో కౌంటింగ్ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది.
2 కౌంటింగ్ హాల్స్ లో ఓట్లను లెక్కిస్తారు. వాటిల్లో 14 టేబుల్స్ ను ఏర్పాటు చేశారు. మొత్తం 22 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. ఒక్కో రౌండ్కు 14 ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 3 గంటలకు ఫలితం వెల్లడి కానుంది.
కాగా హుజురాబాద్ నియోజకవర్గంలో హుజురాబాద్ మండలంలోని ఓట్లను 6 రౌండ్లలో లెక్కిస్తారు. అలాగే వీణవంక మండలం ఓట్లను 4 రౌండ్లలో, జమ్మికుంట మండలంలోని ఓట్లను 5 రౌండ్లలో, ఇల్లంతకుంట మండలంలోని ఓట్లను 3 రౌండ్లలో, కమలాపూర్ మండలంలోని ఓట్లను 4 రౌండ్లలో లెక్కిస్తారు. కాగా ఇప్పటికే హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం పట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొనగా.. మరికొన్ని గంటల్లో ఆ ఉత్కంఠకు తెర పడనుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…