Huzurabad : హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్కు సర్వం సిద్ధం అయింది. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ప్రచారం అనంతరం పోలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలోనే గతంలోకన్నా 2 శాతం ఎక్కువగానే ఈ సారి హుజురాబాద్లో పోలింగ్ నమోదు అయింది. మొత్తం 86.33 పోలింగ్ శాతం నమోదైంది. దీంతో గెలుపు తమదంటే తమది అంటూ.. అభ్యర్థులు ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఈ క్రమంలో ఉప ఎన్నిక ఫలితంపై మరికొద్ది గంటల్లో ఉత్కంఠ వీడనుంది. 6 నెలల నుంచి జరిగిన రాజకీయ పోరాటంలో గెలుపు ఎవరిదో తేలిపోనుంది.
హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ లో ఓట్లను లెక్కించనున్నారు. ఇందుకు గాను 2 కౌంటింగ్ హాల్స్ ను ఏర్పాటు చేశారు. ముందుగా 753 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఈ క్రమంలో కౌంటింగ్ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది.
2 కౌంటింగ్ హాల్స్ లో ఓట్లను లెక్కిస్తారు. వాటిల్లో 14 టేబుల్స్ ను ఏర్పాటు చేశారు. మొత్తం 22 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. ఒక్కో రౌండ్కు 14 ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 3 గంటలకు ఫలితం వెల్లడి కానుంది.
కాగా హుజురాబాద్ నియోజకవర్గంలో హుజురాబాద్ మండలంలోని ఓట్లను 6 రౌండ్లలో లెక్కిస్తారు. అలాగే వీణవంక మండలం ఓట్లను 4 రౌండ్లలో, జమ్మికుంట మండలంలోని ఓట్లను 5 రౌండ్లలో, ఇల్లంతకుంట మండలంలోని ఓట్లను 3 రౌండ్లలో, కమలాపూర్ మండలంలోని ఓట్లను 4 రౌండ్లలో లెక్కిస్తారు. కాగా ఇప్పటికే హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం పట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొనగా.. మరికొన్ని గంటల్లో ఆ ఉత్కంఠకు తెర పడనుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…