Puneeth Rajkumar : కన్నడ పవర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న నటుడు, దివంగత పునీత్ కుమార్ మరణం అందరినీ శోకసంద్రంలోకి నెట్టింది. ఆయన హఠాత్ మరణాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. తమ అభిమాన నటుడి మరణవార్త విన్న ఎందరో అభిమానుల గుండెలు కూడా ఆగిపోయాయి. పునీత్ మరణవార్తను తెలుసుకున్న సినీ ప్రపంచం ఆయనకు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని ప్రకటించింది.
ఇక పునీత్ కి తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీలతో ఎంతో మంచి సంబంధం ఉంది. తెలుగు, తమిళ హీరోలు నటించిన సినిమాలు కన్నడంలో విడుదలయ్యి మంచి వసూళ్లను రాబడుతాయి. తెలుగు, తమిళ ఇండస్ట్రీలతో పునీత్ కి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అనుబంధంతోనే తెలుగు హీరోలు పునీత్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ తమ మిత్రుడి ఆఖరి చూపు కోసం చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, వెంకటేష్ వంటి ప్రముఖులు బెంగళూరుకు చేరుకొని తమ మిత్రుడిని కడసారి చూసుకుని వీడ్కోలు పలికారు.
అదేవిధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఎంతో మంది హీరోలు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. తమ అభిమాన నటుడి పట్ల తెలుగు హీరోలు చూపిస్తున్న ప్రేమను చూసి కన్నడ అభిమానులు ఎంతో ముచ్చట పడ్డారు.
ఈ క్రమంలోనే పునీత్ అభిమానులు తమిళ హీరోల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడు పునీత్ కి తమిళంలో కూడా ఎంతో మంచి మిత్రులు ఉన్నారు. వారి సినిమాలు కూడా ఇక్కడ విడుదలవుతుంటాయి. అలాంటిది ఒక స్టార్ హీరో మృతి చెందితే ఏ ఒక్క తమిళ హీరో కూడా ఆయన కడచూపు కోసం బెంగుళూరుకు రాలేదంటూ తమిళ హీరోలు అందరూ ఎక్కడ..? అంటూ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై కన్నడలో తమిళ హీరోల సినిమాలను బాయ్కాట్ చేస్తామంటూ పునీత్ అభిమానులు హెచ్చరిస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…