Evelyn Sharma : సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు కొన్ని సందర్భాల్లో వివాదాలకు కారణమవుతుంటాయి. అయితే కొన్ని సార్లు వారు ఎలాంటి పొరపాటు చేయకపోయినా.. నెటిజన్ల విమర్శలకు గురవుతుంటారు. తాజాగా బాలీవుడ్ నటి ఎవ్లిన్ శర్మకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తాను తల్లి పాలు ఎంత ముఖ్యమో తెలియజేస్తూ పెట్టిన పోస్టు కొందరికి నచ్చకపోగా.. వారు ఆమెను విమర్శిస్తున్నారు.
ఎవ్లిన్ శర్మ తన 2 నెలల కుమార్తె అవా భిండికి పాలిస్తూ దిగిన ఓ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. తల్లిపాలు బిడ్డకు ఎంత ముఖ్యమో ఆమె ఆ పోస్టులో తెలియజేసింది. అయితే ఆమె ఆ పోస్టు పెట్టినందుకు కొందరు నెటిజన్లు ఆమెను విమర్శిస్తున్నారు. ఇలాంటి ప్రయివేటు ఫొటోలను కూడా షేర్ చేయాలా ? అవసరమా ? అని కామెంట్లు చేశారు. అయితే ఆ కామెంట్లకు ఆ నటి స్పందించింది.
తాను తల్లి పాల ఆవశ్యకతను తెలియజేస్తూ ఆ పోస్టు పెట్టానని.. ఇందులో ప్రయివేటు ఏముందని ఆమె ప్రశ్నించింది. బిడ్డకు జన్మనివ్వడం అంటే తల్లికి పునర్జన్మ లాంటిదని, పిల్లలకు తల్లిపాలు ఎంత ముఖ్యమో తెలియజేయాలనే ఉద్దేశంతోనే నిర్మొహమాటంగా తాను ఆ పోస్ట్ పెట్టానని.. ఇందులో తప్పేముందని.. తల్లులందరూ తమ పిల్లలకు కచ్చితంగా పాలివ్వాలని.. నటి ఎవ్లిన్ శర్మ తనపై విమర్శలకు కౌంటర్ ఇచ్చింది.
కాగా ఎవ్లిన్ శర్మ మే 15, 2021వ తేదీన ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్కు చెందిన తుషాన్ భిండి అనే ఓ డెంటల్ సర్జన్ను వివాహం చేసుకుంది. తరువాత నవంబర్ 12, 2021వ తేదీన బిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువుకు వారు అవా భిండి అని నామకరణం చేశారు. గతంలో ఎవ్లిన్ శర్మ.. యే జవానీ హై దీవానీ, యారియా, జబ్ హారీ మెట్ సెజల్, కుచ్ కుచ్ లోచా హై అనే చిత్రాల్లో నటించింది. చివరిగా సాహో చిత్రంలోనూ ఈమె కనిపించింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…