Schools : తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ బడి గంటలు మోగనున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలను మళ్లీ ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా కేసుల కారణంగా జనవరి 8వ తేదీ నుంచే రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలకు సంక్రాంతి సెలవులను ముందుగానే ప్రకటించారు.
అయితే కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా సంక్రాంతి అనంతరం సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆ సెలవులు ఈ నెల 31వ తేదీతో ముగియనున్నాయి. అయితే సెలవులు ముగియనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసుల సంఖ్య ప్రస్తుతం తగ్గుతున్న కారణంగా ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు, కాలేజీలను మళ్లీ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ తేదీ నుంచి స్కూళ్లు, కాలేజీలను పునః ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. స్కూళ్లు, కాలేజీల్లో కరోనా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు.. విద్యార్థులు కరోనా జాగ్రత్తలను పాటించేలా చూడాలన్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…