Schools : తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ బడి గంటలు మోగనున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలను మళ్లీ ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా కేసుల కారణంగా జనవరి 8వ తేదీ నుంచే రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలకు సంక్రాంతి సెలవులను ముందుగానే ప్రకటించారు.
అయితే కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా సంక్రాంతి అనంతరం సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆ సెలవులు ఈ నెల 31వ తేదీతో ముగియనున్నాయి. అయితే సెలవులు ముగియనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసుల సంఖ్య ప్రస్తుతం తగ్గుతున్న కారణంగా ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు, కాలేజీలను మళ్లీ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ తేదీ నుంచి స్కూళ్లు, కాలేజీలను పునః ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. స్కూళ్లు, కాలేజీల్లో కరోనా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు.. విద్యార్థులు కరోనా జాగ్రత్తలను పాటించేలా చూడాలన్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…