Dil Raju : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన లేటెస్ట్ మూవీ.. థాంక్ యూ. ఇందులో నాగచైతన్య, రాశి ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించగా.. మాళవికా నాయర్, అవికా గోర్లు ఇతర కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీ జూలై 22వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ కలెక్షన్లు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. తొలి రోజు వరల్డ్ వైడ్గా థాంక్ యూ మూవీకి రూ.2.16 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ క్రమంలోనే సినిమా నిరాశ పరిచిందని.. దిల్ రాజుకు ఈ మూవీ భారీ నష్టాన్నే కలిగించిందని అంటున్నారు.
థాంక్ యూ మూవీకి గాను తొలి రోజు నైజాంలో రూ.72 లక్షలు, సీడెడ్లో రూ.20 లక్షలు, గుంటూరు రూ.10 లక్షలు, కృష్ణా రూ.12 లక్షలు, నెల్లూరు రూ.7 లక్షలు వచ్చాయి. అలాగే తెలంగాణ, ఏపీ కలిపి తొలి రోజు కలెక్షన్లు రూ.1.65 కోట్ల వరకు వచ్చాయి. ఇక వరల్డ్ వైడ్గా మత్తం రూ.3.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. రూ.2.16 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. అయితే మూవీ మొత్తం రూ.24 కోట్ల బిజినెస్ చేసిందని చెబుతుండగా.. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా రూ.25 కోట్లు రావాలి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని అంటున్నారు.
తెలంగాణతోపాటు ఏపీలోనూ అనేక ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ప్రజలు కాలు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఇది సినిమా కలెక్షన్లపై బాగానే ప్రభావం చూపిస్తుందని చెప్పవచ్చు. అయితే వర్షాలు తగ్గినప్పటికీ ఇంకో రెండు మూడు రోజుల తరువాత సినిమాను చూసేందుకు పెద్దగా ఆసక్తిని చూపరు. తొలి రోజే కలెక్షన్లు ఇలా ఉంటే మిగిలిన రోజుల్లో కలెక్షన్లు ఇంకా పడిపోతాయని భావించవచ్చు. అదే జరిగితే బ్రేక్ ఈవెన్ సాధించేందుకు చాలా కాలమే పడుతుంది. కానీ అప్పటి వరకు ఓటీటీలోనూ వచ్చేస్తుంది. కనుక ఈ మూవీతో మేకర్స్ కు నష్టమే వచ్చిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే కాస్తంత నష్టాన్ని భర్తీ చేయాలంటే సినిమాను ఓటీటీలో కాస్త ముందుగా రిలీజ్ చేయాలి. మరి మేకర్స్ ఏం చేస్తారో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…