Dil Raju : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన లేటెస్ట్ మూవీ.. థాంక్ యూ. ఇందులో నాగచైతన్య, రాశి ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించగా.. మాళవికా నాయర్, అవికా గోర్లు ఇతర కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీ జూలై 22వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ కలెక్షన్లు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. తొలి రోజు వరల్డ్ వైడ్గా థాంక్ యూ మూవీకి రూ.2.16 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ క్రమంలోనే సినిమా నిరాశ పరిచిందని.. దిల్ రాజుకు ఈ మూవీ భారీ నష్టాన్నే కలిగించిందని అంటున్నారు.
థాంక్ యూ మూవీకి గాను తొలి రోజు నైజాంలో రూ.72 లక్షలు, సీడెడ్లో రూ.20 లక్షలు, గుంటూరు రూ.10 లక్షలు, కృష్ణా రూ.12 లక్షలు, నెల్లూరు రూ.7 లక్షలు వచ్చాయి. అలాగే తెలంగాణ, ఏపీ కలిపి తొలి రోజు కలెక్షన్లు రూ.1.65 కోట్ల వరకు వచ్చాయి. ఇక వరల్డ్ వైడ్గా మత్తం రూ.3.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. రూ.2.16 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. అయితే మూవీ మొత్తం రూ.24 కోట్ల బిజినెస్ చేసిందని చెబుతుండగా.. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా రూ.25 కోట్లు రావాలి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని అంటున్నారు.
తెలంగాణతోపాటు ఏపీలోనూ అనేక ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ప్రజలు కాలు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఇది సినిమా కలెక్షన్లపై బాగానే ప్రభావం చూపిస్తుందని చెప్పవచ్చు. అయితే వర్షాలు తగ్గినప్పటికీ ఇంకో రెండు మూడు రోజుల తరువాత సినిమాను చూసేందుకు పెద్దగా ఆసక్తిని చూపరు. తొలి రోజే కలెక్షన్లు ఇలా ఉంటే మిగిలిన రోజుల్లో కలెక్షన్లు ఇంకా పడిపోతాయని భావించవచ్చు. అదే జరిగితే బ్రేక్ ఈవెన్ సాధించేందుకు చాలా కాలమే పడుతుంది. కానీ అప్పటి వరకు ఓటీటీలోనూ వచ్చేస్తుంది. కనుక ఈ మూవీతో మేకర్స్ కు నష్టమే వచ్చిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే కాస్తంత నష్టాన్ని భర్తీ చేయాలంటే సినిమాను ఓటీటీలో కాస్త ముందుగా రిలీజ్ చేయాలి. మరి మేకర్స్ ఏం చేస్తారో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…