Virat Kohli : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బ్యాట్స్మన్ విరాట్ కోహ్లి ఇప్పుడు అంత ఫేమ్ను కోల్పోయాడు. కానీ కోహ్లి కెప్టెన్గా ఉన్నన్ని రోజులూ ఒక వెలుగు వెలిగాడు. కోచ్ను ఎంపిక చేయడం దగ్గర నుంచి జట్టు సెలెక్షన్ వరకు కోహ్లి అన్నింటా కీలకపాత్రను పోషించాడు. అయితే గతేడాది టీ20 వరల్డ్ కప్లో దారుణ పరాభవం తరువాత అతను జట్టుకు కెప్టెన్ గా వైదొలిగాడు. తరువాత అతన్ని వన్డే, టెస్టు జట్ల కెప్టెన్గా కూడా తప్పించారు. ఈ క్రమంలోనే ఫామ్ను కోల్పోయిన కోహ్లి ప్రస్తుతం బ్యాట్స్మన్గా కొనసాగేందుకే ఇబ్బందులు పడుతున్నాడు. ఇటీవలి కాలంలో కోహ్లి ఏమాత్రం ఆకట్టుకునే విధంగా ప్రదర్శన చేయలేదు.
అయితే కోహ్లి బ్యాట్స్మన్గా విఫలం అవుతున్నప్పటికీ సంపాదనలో మాత్రం టాప్లోనే ఉన్నాడు. ఆసియాలోనే ఇన్స్టాగ్రామ్ ద్వారా అత్యధిక మొత్తం సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాలో కోహ్లి మొదటి స్థానంలో నిలిచాడు. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే సదరు జాబితాలో కోహ్లి 14వ స్థానంలో నిలిచాడు. ఈ మేరకు హాపర్ హెచ్క్యూ అనే సంస్థ 2022కు గాను ఇన్స్టాగ్రామ్ ద్వారా సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను తాజాగా విడుదల చేసింది.
హాపర్ హెచ్క్యూ విడుదల చేసిన ఇన్స్టాగ్రామ్ రిచ్ లిస్ట్ 2022 ప్రకారం కోహ్లి ఇన్స్టాగ్రామ్లో ఒక్క పోస్ట్కు 10.88 లక్షల డాలర్లను సంపాదిస్తున్నాడని తేలింది. అంటే మన కరెన్సీలో దాదాపుగా రూ.8.69 కోట్లుగా వస్తుంది. ఇక ఇదే జాబితాలో క్రిస్టియానో రొనాల్డొ 23.97 లక్షల డాలర్ల సంపాదనతో మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో అమెరికన్ మోడల్ కైలీ జెన్నర్ నిలిచింది. ఈమె ఒక్క పోస్ట్కు 18.35 లక్షల డాలర్లను ఇన్స్టాగ్రామ్లో సంపాదిస్తోంది. అలాగే మూడో స్థానంలో లియోనెల్ మెస్సీ నిలిచాడు. ఇతను ఒక్క ఇన్స్టాగ్రామ్ పోస్ట్కు 17.77 లక్షల డాలర్లను సంపాదిస్తూ ఆ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…