Dil Raju : ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా మారింది ప్రముఖ నిర్మాత దిల్ రాజు పరిస్థితి. మొన్నా నడుమ రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వం, మంత్రులపై వ్యాఖ్యలు చేయడం ఏమో గానీ.. అక్కడ వేడుకలో స్టేజీ ఎదురుగా ఉండి నవ్వినందుకు దిల్ రాజు హుటాహుటిన మంత్రి పేర్ని నానిని వెళ్లి కలిశారు. అబ్బే.. పవన్ అలా అన్నారు కానీ.. దానికి మాకు ఏం సంబంధం లేదు, ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని మంత్రి నానికి స్వరం వినిపించారు.
అయితే మంత్రి పేర్ని నానిని కలిసేందుకు వెళ్లిన నిర్మాతలందరితోనూ దిల్ రాజు మళ్లీ పవన్ను కలిశారు. దీంతో ఆసక్తికర చర్చ మొదలైంది. దిల్ రాజు నిర్మిస్తున్న పలు సినిమాలు భవిష్యత్తులో విడుదల కానున్నాయి. అవి విడుదల అయ్యే వరకు ఎలాంటి ఉద్రిక్త వాతావరణం లేకుండా శాంతియుతంగా ఉండాలని.. ఈ వివాదాలన్నీ సద్దుమణగాలని.. అప్పుడే తనకు గానీ, ఇతర నిర్మాతలకు గానీ ఎలాంటి భయం లేకుండా ఉంటుందని దిల్ రాజ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకనే ఆయన అటు ఏపీ ప్రభుత్వానికి, ఇటు పవన్కు మధ్య రాయబారం నడిపిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు.
పరస్పరం వ్యాఖ్యలు, విమర్శలు చేసుకున్న పవన్, వైసీపీ మంత్రులు బాగానే ఉన్నారు, కానీ దెబ్బ పడేది నిర్మాతలకే. ఇప్పటికే కరోనా వల్ల తీవ్ర నష్టాల్లో ఉన్న చిత్ర పరిశ్రమకు మళ్లీ పూర్వ రోజులు రావాలంటే చాలా కాలం వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది. ఇలాంటి గడ్డు సమయంలో ఈవిధంగా వివాదాలు వస్తే అవి నిర్మాతలకు ఏమాత్రం మంచివి కావు. కనుకనే దిల్ రాజు నేతృత్వంలో వారందరూ కాళ్లకు బలపాలు కట్టుకుని అటు, ఇటు తిరుగుతున్నారు. మరి దిల్ రాజు రాయబారం ఫలిస్తుందా ? వివాదాలన్నీ సద్దుమణిగిపోతాయా ? అన్నది తెలియాలంటే.. మరికొంత కాలం వేచి చూడక తప్పదు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…