Dil Raju : ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా మారింది ప్రముఖ నిర్మాత దిల్ రాజు పరిస్థితి. మొన్నా నడుమ రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వం, మంత్రులపై వ్యాఖ్యలు చేయడం ఏమో గానీ.. అక్కడ వేడుకలో స్టేజీ ఎదురుగా ఉండి నవ్వినందుకు దిల్ రాజు హుటాహుటిన మంత్రి పేర్ని నానిని వెళ్లి కలిశారు. అబ్బే.. పవన్ అలా అన్నారు కానీ.. దానికి మాకు ఏం సంబంధం లేదు, ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని మంత్రి నానికి స్వరం వినిపించారు.
అయితే మంత్రి పేర్ని నానిని కలిసేందుకు వెళ్లిన నిర్మాతలందరితోనూ దిల్ రాజు మళ్లీ పవన్ను కలిశారు. దీంతో ఆసక్తికర చర్చ మొదలైంది. దిల్ రాజు నిర్మిస్తున్న పలు సినిమాలు భవిష్యత్తులో విడుదల కానున్నాయి. అవి విడుదల అయ్యే వరకు ఎలాంటి ఉద్రిక్త వాతావరణం లేకుండా శాంతియుతంగా ఉండాలని.. ఈ వివాదాలన్నీ సద్దుమణగాలని.. అప్పుడే తనకు గానీ, ఇతర నిర్మాతలకు గానీ ఎలాంటి భయం లేకుండా ఉంటుందని దిల్ రాజ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకనే ఆయన అటు ఏపీ ప్రభుత్వానికి, ఇటు పవన్కు మధ్య రాయబారం నడిపిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు.
పరస్పరం వ్యాఖ్యలు, విమర్శలు చేసుకున్న పవన్, వైసీపీ మంత్రులు బాగానే ఉన్నారు, కానీ దెబ్బ పడేది నిర్మాతలకే. ఇప్పటికే కరోనా వల్ల తీవ్ర నష్టాల్లో ఉన్న చిత్ర పరిశ్రమకు మళ్లీ పూర్వ రోజులు రావాలంటే చాలా కాలం వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది. ఇలాంటి గడ్డు సమయంలో ఈవిధంగా వివాదాలు వస్తే అవి నిర్మాతలకు ఏమాత్రం మంచివి కావు. కనుకనే దిల్ రాజు నేతృత్వంలో వారందరూ కాళ్లకు బలపాలు కట్టుకుని అటు, ఇటు తిరుగుతున్నారు. మరి దిల్ రాజు రాయబారం ఫలిస్తుందా ? వివాదాలన్నీ సద్దుమణిగిపోతాయా ? అన్నది తెలియాలంటే.. మరికొంత కాలం వేచి చూడక తప్పదు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…