Bank Fraud : మొబైల్ ఫోన్లు, డెబిట్, క్రెడిట్ కార్డుల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కొన్ని సందర్భాల్లో తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓ వ్యక్తికి కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. తన స్నేహితుని కార్లో తన ఫోన్, కార్డులను పెట్టి వేరే చోటకు వెళ్లాడు. దీంతో ఫోన్, పర్సును ఎవరో కొట్టేశారు. తరువాత అతని బ్యాంక్ అకౌంట్లో రూ.9.50 లక్షలను కాజేశారు. చివరకు బ్యాంకు మాత్రం ఆ డబ్బును వెనక్కి తిరిగి ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. వివరాల్లోకి వెళితే..
ముంబైలోని విక్రోలి అనే ప్రాంతానికి చెందిన ఏరత్ అనే 51 ఏళ్ల వ్యక్తి ఓ కన్సల్టింగ్ సంస్థను నిర్వహిస్తున్నాడు. కాగా ఇతను ఆగస్టు 22వ తేదీన అక్కడి ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే ప్రాంతంలో తన స్నేహితులను కలిసేందుకు వెళ్లాడు. అక్కడ ఓ స్నేహితుని కార్లో తన ఫోన్, పర్సును పెట్టి వేరే దగ్గరకు వెళ్లాడు. తరువాత వచ్చి చూడా ఫోన్, పర్సు పోయినట్లు గుర్తించాడు. పర్సులో అతని డెబిట్, క్రెడిట్ కార్డులు అన్నీ ఉన్నాయి.
అయితే ఉదయం 7.30 గంటలకు అతను తిరిగి వచ్చాక చూసి అవి పోయినట్లు గుర్తించాడు. కానీ ఫిర్యాదు మాత్రం వెంటనే చేయలేదు. ఇదే అతని కొంప ముంచింది. మధ్యాహ్నం 1 గంటకు బ్యాంకు సిబ్బందికి కాల్ చేసి అకౌంట్ను ఫ్రీజ్ చేయించాడు. కార్డులను బ్లాక్ చేయించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది. అతని ఐసీఐసీఐ బ్యాంకు అకౌంట్లో ఉన్న రూ.9.50 లక్షలను కాజేశారు.
ఒక్క వ్యక్తే ఈ దొంగతనానికి పాల్పడ్డినట్లు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. కానీ అతను మాస్క్ పెట్టుకుని ఉన్నాడని, అందువల్ల అతన్ని సరిగ్గా గుర్తించలేకపోతున్నామని పోలీసులు తెలిపారు. అయితే ఈ సంఘటన జరిగిన తరువాత ఏరత్ తన డబ్బును రీఫండ్ చేయాలని బ్యాంకుకు రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. కానీ బ్యాంకు వారు అందుకు నిరాకరించారు.
తాము ఏరత్కు చెందిన అకౌంట్ నుంచి నగదు విత్డ్రా అవుతున్నప్పుడు అతని ఫోన్ కాల్ చేసి వెరిఫై చేశామని, అవతలి నుంచి తానే చేస్తున్నట్లు చెప్పాడని, అందువల్ల ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని బ్యాంకు వారు తేల్చేశారు. కానీ నిజానికి అతని ఫోన్ కూడా పోయింది. అవతలి వ్యక్తి ఏరత్ కాదు. దొంగతనం చేసిన వ్యక్తి. కనుక బ్యాంకు వారు కాల్ చేసినా అతనే లిఫ్ట్ చేశాడు కాబట్టి తానే ఏరత్ అని కన్ఫాం చేశాడు. దీంతో బ్యాంకు వారు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. అలా అతని నిర్లక్ష్యం కారణంగా రూ.9.50 లక్షలను పోగొట్టుకున్నాడు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…