Bhimla Nayak : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం.. భీమ్లా నాయక్. దీనికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. దగ్గుబాటి రానా మరో కీలకపాత్ర పోషిస్తున్నారు. మళయాళంలో సూపర్ హిట్గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. భీమ్లానాయక్లో నిత్యామీనన్ పవన్ సరసన నటిస్తోంది.
భీమ్లానాయక్ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, గ్లింప్స్, పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా తాజాగా విడుదలైన అడవి తల్లి మాట అనే పాట కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్ ట్రెండింగ్లోకి వచ్చేసింది. యూట్యూబ్లో రికార్డులను సృష్టిస్తోంది. ఇప్పటికే ఎన్నో లక్షల మంది ఈ పాటను వీక్షించారు.
ఈ పాటను ఫోక్ సింగర్ కుమ్మరి దుర్గవ్వ, సాహితి చాగంటి కలిసి పాడారు. ఈ పాటకు విశేష స్పందన లభిస్తోంది. ఈ క్రమంలోనే అసలు ఈ దుర్గవ్వ ఎవరు.. అని ఫ్యాన్స్ ఆరాలు తీయడం మొదలుపెట్టారు.
కాగా దుర్గవ్వ మంచిర్యాల జిల్లా వాసి. పెద్దగా ఏమీ చదువుకోలేదు. పొలం పనులకు వెళ్లినప్పుడు జానపదాలను పాడుతూ ఉంటుంది. దుర్గవ్వ కేవలం తెలుగులోనే కాకుండా మరాఠీలోనూ అనేక పాటలు పాడారు.
తెలుగులో దుర్గవ్వ పాడిన ఉంగురమే రంగైనా రాములాల టుంగురమే.. అనే పాట లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుంది. అదేవిధంగా సోషల్ మీడియాలో ఈ పాట ట్రెండ్ అవుతోంది. దీంతోపాటు సిరిసిల్లా చిన్నది లాంటి పాపులర్ పాటలను ఆమె పాడి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమాలో దుర్గవ్వ పాడిన అడవి తల్లి మాట.. అనే పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ పాటకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇప్పటికే 40 లక్షలకు పైగా వ్యూస్ను సాధించిన ఈ పాట యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…