Konidela Upasana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ భార్య కొణిదెల ఉపాసనకు మెగా కోడలు అన్న బిరుదు ఉండనే ఉంది. అయినప్పటికీ ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందారు. ఎల్లప్పుడూ సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె నిమగ్నమవుతుంటారు. ఓ వైపు అపోలో హాస్పిటల్కు చెందిన బాధ్యతలను చూసుకుంటూనే మరోవైపు ఉపాసన సామాజిక సేవ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.
కొణిదెల ఉపాసన పేదలకు ఎక్కువగా సహాయం చేస్తుంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫిట్నెస్ విషయాలను, తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆమెకు మూగ జీవాలపై ప్రేమ కూడా ఎక్కువే. అందుకనే సోషల్ మీడియాలోనూ జంతు సంరక్షణ గురించి ఆమె చెబుతుంటారు. ఇక తాజాగా కొణిదెల ఉపాసన చేసిన పనికి అందరూ ఆమెకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్లో విక్కీ, లక్ష్మీ అనే రెండు ఆసియా సింహాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఉపాసన వాటిని దత్తత తీసుకున్నారు. ఏడాది పాటు వాటి సంరక్షణ బాధ్యతలు, ఆహార ఖర్చులను ఆమే స్వయంగా చూసుకోనున్నారు. అందుకుగాను జూ సిబ్బందికి రూ.2 లక్షల చెక్కును ఆమె అందజేశారు. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది. ఉపాసన చేస్తున్న మంచి పనికి ఆమెను అందరూ అభినందిస్తున్నారు.
ఇక ఉపాసన గతంలోనూ రాణి అనే ఓ ఏనుగును దత్తత తీసుకున్నారు. దాని సంరక్షణకు ఆమె రూ.5 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు ఈ సింహాలను దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జూలో 2000 జంతువులు ఉన్నాయని, వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే తపన ఉందని, అందుకనే తన వంతుగా సింహాలను దత్తత తీసుకున్నానని తెలియజేశారు. ఏది ఏమైనా.. ఉపాసన గురించిన ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…