Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ తొలిసారి ఆహా కోసం హోస్ట్గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ షోకి సంబంధించి ప్రోమో విడుదల చేయగా, ఇందులో ఇటు బాలకృష్ణ, అటు మోహన్ బాబు సంధించిన ప్రశ్నలకు అభిమానులలో అనేక ఆలోచనలు మొదలయ్యాయి. ముఖ్యంగా మోహన్ బాబు.. బాలయ్యని ఎన్టీఆర్ తర్వాత మీరెందుకు తెదేపా పగ్గాలు తీసుకోలేదని ప్రశ్నించారు.
మోహన్ బాబు ప్రశ్నకి స్పందించిన బాలకృష్ణ.. మా తెలుగుదేశం పార్టీ పెట్టిందే వారసత్వ రాజకీయాలకి అతీతంగా.. పెద్దాయన తరువాత మేము తీసుకుంటే ఇంక దానికి అర్థం ఏం ఉంటుంది. చంద్రబాబు చాలా కష్టపడే తత్త్వం ఉన్న వ్యక్తి. ఆయన కాలేజీ, గ్రామ, మండల స్థాయి రాజకీయాల నుండి అన్నీ చూసి వచ్చిన మనిషి. ఆయన కాబట్టే ఆ బాధ్యతలను అలా చేయగలిగాడు. అన్నగారి ఆశయాలను ముందుకి తీసుకెళ్ల గలిగాడు.. అంటూ బాలయ్య సమాధానం ఇచ్చారు.
మీరు నటించిన సినిమాల్లో అస్సలు చూసుకోలేని సినిమా ఏది అని బాలకృష్ణ అడిగితే, ‘‘పటాలం పాండు’ చేసిన తర్వాత నా భార్య నిర్మల వారం రోజులు మాట్లాడలేదు’’ అని చెప్పారు. తన బ్యానర్లో వరుసగా సినిమాలు ఫ్లాప్ అయితే, మహాబలిపురంలో భూములు అమ్మి అందరికీ డబ్బులు చెల్లించినట్లు మోహన్బాబు తెలిపారు. ఆ తర్వాత ‘అల్లుడుగారు’, ‘అసెంబ్లీ రౌడీ’, ‘బ్రహ్మ’, ‘పెదరాయుడు’ వరుస విజయాలతో నిలబడ్డానని వివరించారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…