ప్రేమ‌ను పంచి ఇవ్వ‌డ‌మే కాదు.. లివ‌ర్‌ను భ‌ర్త‌కు దానం చేసి ర‌క్షించుకుంది..!

July 10, 2021 12:06 PM

ప్రేమంటే అంతే.. సుఖాల్లోనే కాదు, క‌ష్టాల్లోనూ ఒక‌రికి ఒక‌రు తోడుండాలి. ఒక‌రి కోసం ఇంకొక‌రు ప్రాణాలు ఇచ్చేందుకైనా, ఏం చేయ‌డానికైనా సిద్ధంగా ఉండాలి. అవును.. ఆ జంట కూడా స‌రిగ్గా ఇలా చేసింది. భ‌ర్త త‌న‌కు ప్రేమ‌ను పంచితే భార్య త‌న భ‌ర్త‌కు త‌న శ‌రీర అవ‌య‌వాన్ని పంచి ఇచ్చింది. ఈ సంఘ‌ట‌నకు హైద‌రాబాద్ న‌గ‌రంలోని లక్డీకాపూల్ లో ఉన్న గ్లెనిగల్స్‌ గ్లోబల్ హాస్పిట‌ల్‌ వేదికగా నిలిచింది. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే..

this woman not only shared her love but also shared her liver to her husband

ఏపీలోని క‌డప జిల్లా పొద్దుటూరుకు చెందిన ముంతాజ్ అనే మ‌హిళ‌ అదే ప్రాంతానికి చెందిన వెంకటసుబ్బారెడ్డి అనే వ్య‌క్తిని 20 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. మ‌తాలు వేరు కావ‌డంతో వారు పెద్ద‌ల‌ను ఎదిరించి మ‌రీ వివాహం చేసుకున్నారు. ఈ క్ర‌మంలో వారు అన్యోన్యంగా జీవిస్తున్నారు. అయితే సుబ్బారెడ్డికి గుండె పోటు వ‌చ్చింది. దీంతో వైద్యులు స్టంట్లు వేశారు. అనంత‌రం గ‌తేడాది అతనికి కామెర్లు వ‌చ్చాయి. ప‌రిస్థితి విష‌మించింది. దీంతో అత‌న్ని మ‌ళ్లీ అదే హాస్పిట‌ల్‌లో చేర్పించారు. ఈ క్ర‌మంలో అత‌నికి ప‌రీక్ష చేసిన వైద్యులు అత‌ని లివ‌ర్ పూర్తిగా దెబ్బ తిన్న‌ద‌ని చెప్పారు. లివ‌ర్‌ను మార్పిడి చేయ‌డం ఒక్క‌టే మార్గ‌మ‌ని చెప్పారు.

దీంతో ముంతాజ్ త‌న భ‌ర్త‌కు లివ‌ర్ ఇచ్చింది. ఈ ఏడాది మార్చిలో ఆప‌రేష‌న్ చేశారు. అందుకు రూ.20 ల‌క్ష‌లు ఖ‌ర్చు కాగా, రూ.10 ల‌క్ష‌ల‌ను ఏపీ ప్ర‌భుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ కింద అంద‌జేసింది. ఇక ఆప‌రేష‌న్ విజ‌య‌వంతం కావ‌డంతో భార్య‌, భ‌ర్త ఇద్ద‌రూ కోలుకుంటున్నారు. అలా సుబ్బారెడ్డి ఆమెకు ప్రేమ‌ను పంచితే ఆమె త‌న లివ‌ర్‌ను పంచి ఇచ్చింది. త‌న భ‌ర్త‌ను ర‌క్షించుకుంది. ఇప్పుడు వారిద్ద‌రూ ఆరోగ్యంగానే ఉన్నార‌ని వైద్యులు తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now