ఒకప్పుడు కొవ్వు పదార్థాల డైట్ను పాటించాలని చెప్పి ఫేమస్ అయిన వీరమాచనేని గుర్తున్నారు కదా. ఎన్నో వ్యాధులను కేవలం డైట్ తోనే తగ్గించుకోవచ్చని ఆయన ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఎంతో మంది ఆయన డైట్ను పాటించి అనారోగ్యాలను తగ్గించుకున్నారు. అయితే ఆయనకు గుంటూరు జిల్లాలోని విజ్ఞాన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది.
డైట్కు సంబంధించి వీరమాచనేని చేసిన కృషికి గాను విజ్ఞాన్ యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ను ఇచ్చింది. అయితే దీనిపై ప్రముఖ హేతువాది బాబు గోగినేని విమర్శలు చేశారు. డాక్టరేట్ను ఎవరికి పడితే వారికి ఎలా ఇస్తారు ? అసలు ఆయనకు ఉన్న అర్హత ఏమిటి ? సైన్స్ను తప్పు పట్టే వారికి డాక్టరేట్లను ఎలా ప్రదానం చేస్తారు ? డాక్టరేట్ ఇచ్చే ముందు రూల్స్ చెక్ చేశారా ? యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ ఏం చెబుతోంది ? డీమ్డ్ వర్సిటీలకు ఉన్న డైరెక్షన్స్ ఏంటి ? అంటూ బాబు గోగినేని విమర్శించారు.
కరోనాకు వంటింటి పోపుల డబ్బా పరిష్కారం అన్నావు. మరి వ్యాక్సిన్ ఎందుకు వేసుకున్నావు, మాస్క్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదన్న వ్యక్తి స్పుత్నిక్ వ్యాక్సిన్ ఎందుకు వేసుకున్నట్లు.. అని గోగినేని ప్రశ్నించారు. వీరమాచనేని చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి అంటూ గోగినేని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వ కరోనా సూచనలకు వ్యతిరేకంగా ప్రచారం చేసే రామకృష్ణకు డాక్టరేట్ ను ఎలా ఇస్తారు, గౌరవ డాక్టరేట్లకు ఉన్న గౌరవాన్ని తగ్గించారు.. అంటూ హేతువాద సంఘం అధ్యక్షుడు నార్నె వెంకట సుబ్బయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే దీనిపై వీరమాచనేని స్పందించారు. నిజాన్ని ఎదుర్కొలేని వారే తప్పు కౌంటర్లు వేస్తున్నారని అన్నారు. అప్పట్లో తాను చెప్పిన మాటలకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నానన్నారు. ఇంగ్లిష్ మందులతో డయాబెటిస్ తగ్గనప్పుడు మందులను ఎందుకు ఇస్తున్నారని అన్నారు. తన డైట్తో చాలా మందికి డయాబెటిస్ తగ్గిందన్నారు. ఆ విషయంలో ఎవరితోనైనా తాను చాలెంజ్కి రెడీ అని అన్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…