ఒకప్పుడు కొవ్వు పదార్థాల డైట్ను పాటించాలని చెప్పి ఫేమస్ అయిన వీరమాచనేని గుర్తున్నారు కదా. ఎన్నో వ్యాధులను కేవలం డైట్ తోనే తగ్గించుకోవచ్చని ఆయన ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఎంతో మంది ఆయన డైట్ను పాటించి అనారోగ్యాలను తగ్గించుకున్నారు. అయితే ఆయనకు గుంటూరు జిల్లాలోని విజ్ఞాన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది.
డైట్కు సంబంధించి వీరమాచనేని చేసిన కృషికి గాను విజ్ఞాన్ యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ను ఇచ్చింది. అయితే దీనిపై ప్రముఖ హేతువాది బాబు గోగినేని విమర్శలు చేశారు. డాక్టరేట్ను ఎవరికి పడితే వారికి ఎలా ఇస్తారు ? అసలు ఆయనకు ఉన్న అర్హత ఏమిటి ? సైన్స్ను తప్పు పట్టే వారికి డాక్టరేట్లను ఎలా ప్రదానం చేస్తారు ? డాక్టరేట్ ఇచ్చే ముందు రూల్స్ చెక్ చేశారా ? యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ ఏం చెబుతోంది ? డీమ్డ్ వర్సిటీలకు ఉన్న డైరెక్షన్స్ ఏంటి ? అంటూ బాబు గోగినేని విమర్శించారు.
కరోనాకు వంటింటి పోపుల డబ్బా పరిష్కారం అన్నావు. మరి వ్యాక్సిన్ ఎందుకు వేసుకున్నావు, మాస్క్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదన్న వ్యక్తి స్పుత్నిక్ వ్యాక్సిన్ ఎందుకు వేసుకున్నట్లు.. అని గోగినేని ప్రశ్నించారు. వీరమాచనేని చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి అంటూ గోగినేని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వ కరోనా సూచనలకు వ్యతిరేకంగా ప్రచారం చేసే రామకృష్ణకు డాక్టరేట్ ను ఎలా ఇస్తారు, గౌరవ డాక్టరేట్లకు ఉన్న గౌరవాన్ని తగ్గించారు.. అంటూ హేతువాద సంఘం అధ్యక్షుడు నార్నె వెంకట సుబ్బయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే దీనిపై వీరమాచనేని స్పందించారు. నిజాన్ని ఎదుర్కొలేని వారే తప్పు కౌంటర్లు వేస్తున్నారని అన్నారు. అప్పట్లో తాను చెప్పిన మాటలకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నానన్నారు. ఇంగ్లిష్ మందులతో డయాబెటిస్ తగ్గనప్పుడు మందులను ఎందుకు ఇస్తున్నారని అన్నారు. తన డైట్తో చాలా మందికి డయాబెటిస్ తగ్గిందన్నారు. ఆ విషయంలో ఎవరితోనైనా తాను చాలెంజ్కి రెడీ అని అన్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…