ఒకప్పుడు కొవ్వు పదార్థాల డైట్ను పాటించాలని చెప్పి ఫేమస్ అయిన వీరమాచనేని గుర్తున్నారు కదా. ఎన్నో వ్యాధులను కేవలం డైట్ తోనే తగ్గించుకోవచ్చని ఆయన ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఎంతో మంది ఆయన డైట్ను పాటించి అనారోగ్యాలను తగ్గించుకున్నారు. అయితే ఆయనకు గుంటూరు జిల్లాలోని విజ్ఞాన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది.
డైట్కు సంబంధించి వీరమాచనేని చేసిన కృషికి గాను విజ్ఞాన్ యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ను ఇచ్చింది. అయితే దీనిపై ప్రముఖ హేతువాది బాబు గోగినేని విమర్శలు చేశారు. డాక్టరేట్ను ఎవరికి పడితే వారికి ఎలా ఇస్తారు ? అసలు ఆయనకు ఉన్న అర్హత ఏమిటి ? సైన్స్ను తప్పు పట్టే వారికి డాక్టరేట్లను ఎలా ప్రదానం చేస్తారు ? డాక్టరేట్ ఇచ్చే ముందు రూల్స్ చెక్ చేశారా ? యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ ఏం చెబుతోంది ? డీమ్డ్ వర్సిటీలకు ఉన్న డైరెక్షన్స్ ఏంటి ? అంటూ బాబు గోగినేని విమర్శించారు.
కరోనాకు వంటింటి పోపుల డబ్బా పరిష్కారం అన్నావు. మరి వ్యాక్సిన్ ఎందుకు వేసుకున్నావు, మాస్క్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదన్న వ్యక్తి స్పుత్నిక్ వ్యాక్సిన్ ఎందుకు వేసుకున్నట్లు.. అని గోగినేని ప్రశ్నించారు. వీరమాచనేని చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి అంటూ గోగినేని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వ కరోనా సూచనలకు వ్యతిరేకంగా ప్రచారం చేసే రామకృష్ణకు డాక్టరేట్ ను ఎలా ఇస్తారు, గౌరవ డాక్టరేట్లకు ఉన్న గౌరవాన్ని తగ్గించారు.. అంటూ హేతువాద సంఘం అధ్యక్షుడు నార్నె వెంకట సుబ్బయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే దీనిపై వీరమాచనేని స్పందించారు. నిజాన్ని ఎదుర్కొలేని వారే తప్పు కౌంటర్లు వేస్తున్నారని అన్నారు. అప్పట్లో తాను చెప్పిన మాటలకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నానన్నారు. ఇంగ్లిష్ మందులతో డయాబెటిస్ తగ్గనప్పుడు మందులను ఎందుకు ఇస్తున్నారని అన్నారు. తన డైట్తో చాలా మందికి డయాబెటిస్ తగ్గిందన్నారు. ఆ విషయంలో ఎవరితోనైనా తాను చాలెంజ్కి రెడీ అని అన్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…