ఆ మహిళ నిండు గర్భిణి. మరికొన్ని రోజులలో ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న క్రమంలో కఠినమైన నిర్ణయం తీసుకుంది. తాను పడుతున్న కష్టాలు తన బిడ్డ పడకూడదన్న ఉద్దేశంతో ఆ బిడ్డ భూమిపైకి రాకముందే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల లోకి వెళ్తే..
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం, ఒత్కులపల్లి గ్రామానికి చెందిన రమ్య అనే యువతిని అదే మండలం నర్సింగాపూర్కు చెందిన రాజశేఖర్ అనే యువకుడికి ఇచ్చి గతఏడాది వివాహం చేశారు. వీరి వివాహ సమయంలో యువతికి రూ.2 లక్షల కట్నంతోపాటు బంగారం, ఒత్కులపల్లిలో కొంత భూమిని కట్నంగా ఇచ్చారు. పెళ్లి తర్వాత కొన్ని రోజుల పాటు ఎంతో సుఖంగా సాగిన తన జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. తన పేరుపై ఉన్న పొలం అమ్మి డబ్బులు తీసుకురావాలని ఇంట్లో తన భర్త, అత్తమామలు వేధించడం మొదలుపెట్టారు.
ఈ క్రమంలోనే ఆమె భర్త కూడా తనను అదనపు కట్నం తేవాలని రోజూ హింసలు పెట్టేవాడు. రమ్య గర్భం దాల్చగా పరిస్థితులు సద్దుమణుగుతాయని భావించింది. అయితే రోజు రోజుకూ ఆమెను అధిక వేధింపులకు గురి చేయడంతో ఎంతో మానసికంగా కుంగిపోయిన రమ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. విషయం తెలుసుకున్న భర్త, తన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే పరిస్థితి విషమించి ఆమె మృతి చెందింది. రమ్య మృతికి తన అత్తింటి వారే కారణమని, గర్భవతి అని కూడా చూడకుండా తనని దారుణంగా హింసించేవారు.. అంటూ తల్లిదండ్రులు వారి అత్తింటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…