ఆ మహిళ నిండు గర్భిణి. మరికొన్ని రోజులలో ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న క్రమంలో కఠినమైన నిర్ణయం తీసుకుంది. తాను పడుతున్న కష్టాలు తన బిడ్డ పడకూడదన్న ఉద్దేశంతో ఆ బిడ్డ భూమిపైకి రాకముందే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల లోకి వెళ్తే..
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం, ఒత్కులపల్లి గ్రామానికి చెందిన రమ్య అనే యువతిని అదే మండలం నర్సింగాపూర్కు చెందిన రాజశేఖర్ అనే యువకుడికి ఇచ్చి గతఏడాది వివాహం చేశారు. వీరి వివాహ సమయంలో యువతికి రూ.2 లక్షల కట్నంతోపాటు బంగారం, ఒత్కులపల్లిలో కొంత భూమిని కట్నంగా ఇచ్చారు. పెళ్లి తర్వాత కొన్ని రోజుల పాటు ఎంతో సుఖంగా సాగిన తన జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. తన పేరుపై ఉన్న పొలం అమ్మి డబ్బులు తీసుకురావాలని ఇంట్లో తన భర్త, అత్తమామలు వేధించడం మొదలుపెట్టారు.
ఈ క్రమంలోనే ఆమె భర్త కూడా తనను అదనపు కట్నం తేవాలని రోజూ హింసలు పెట్టేవాడు. రమ్య గర్భం దాల్చగా పరిస్థితులు సద్దుమణుగుతాయని భావించింది. అయితే రోజు రోజుకూ ఆమెను అధిక వేధింపులకు గురి చేయడంతో ఎంతో మానసికంగా కుంగిపోయిన రమ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. విషయం తెలుసుకున్న భర్త, తన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే పరిస్థితి విషమించి ఆమె మృతి చెందింది. రమ్య మృతికి తన అత్తింటి వారే కారణమని, గర్భవతి అని కూడా చూడకుండా తనని దారుణంగా హింసించేవారు.. అంటూ తల్లిదండ్రులు వారి అత్తింటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…