హిందువులు ఎన్నో పూజా కార్యక్రమాలను, పండుగలను ఆచరిస్తూ వాటిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ విధంగా జరుపుకునే పండుగలలో శ్రీకృష్ణాష్టమి ఒకటి. హిందూ మతం ప్రకారం శ్రావణ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే అష్టమి తిథి రోజున శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. శ్రీ కృష్ణాష్టమినే శ్రీ కృష్ణ జయంతి, గోకులాష్టమిగా కూడా పిలుస్తారు. ఇకపోతే ఈ ఏడాది కృష్ణాష్టమి ఆగస్టు 30వ తేదీన వచ్చింది. ఆరోజు ప్రతి తల్లి తమ చిన్నారిని కృష్ణుడి వేషధారణలో అలంకరించి ఎంతో సందడిగా ఈ పండుగను జరుపుకుంటారు.
అసలు శ్రీకృష్ణాష్టమిని జరుపుకోవడానికి గల కారణాలు ఏమిటి అనే విషయాలు చాలామందికి తెలియక పోయినప్పటికీ ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మరి శ్రీకృష్ణాష్టమి జరుపుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. లోక సంరక్షణార్ధం, లోక ధర్మం కోసం విష్ణుమూర్తి వివిధ అవతారాలు ఎత్తిన సంగతి మనకు తెలుసు. ఈ క్రమంలోనే విష్ణుమూర్తి 8వ అవతారమే శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణుడు మధురలో చెరసాలలో దేవకికి జన్మించిన సంగతి మనకు తెలిసిందే. అయితే కృష్ణుడు శుక్లపక్షం అష్టమి తిథి రోజున విష్ణువు 8వ అవతారంగా జన్మించడమే కాకుండా దేవకికి 8వ సంతానంగా జన్మించాడు.
పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు జన్మించడానికి గల కారణం భూలోకంలో కృష్ణుడి మేనమామ అయిన కంసుడు చేస్తున్న అరాచకాలకు, దాష్టీకాలతో ప్రజలు ఎంతో ఇబ్బంది పడేవారు. ఈ క్రమంలోనే కంసుడి సంహరణార్థం విష్ణుమూర్తి శ్రీకృష్ణుని అవతారంలో జన్మించి కంసుడిని సంహరించాడు. అదేవిధంగా పాండవులకు అండగా నిలిచి ధర్మాన్ని కాపాడి అధర్మాన్ని ఓడించాడు. చావు పుట్టుకల పరమార్థాన్ని భగవద్గీత ద్వారా తెలియజేశాడు. విష్ణువు శ్రీకృష్ణుని అవతారంలో ధర్మాన్ని కాపాడి, కంసుని వధించి ప్రజలకు విముక్తి కల్పించడం చేత ప్రజలు ఎంతో సంతోషంతో ప్రతి ఏటా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఆ రోజు భక్తులు ఉపవాస దీక్షలతో స్వామివారిని పూజించి కృష్ణుడి ఆలయాలను సందర్శిస్తారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…