Andhra Pradesh : ఏపీలో ఒక క్రమ పద్ధతిలో సంపూర్ణంగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పిన విషయం విదితమే. అయితే అందులో భాగంగానే ఎప్పటికప్పుడు మద్యం ధరలను పెంచుతూ.. మద్యం దుకాణాలు, బార్లను తగ్గిస్తూ వచ్చిన ఏపీ ప్రభుత్వం తాజాగా షాకిచ్చింది. మద్యం ధరలను తగ్గిస్తున్నట్లు తెలిపింది. దీంతో మద్యం ప్రియులు పండుగ చేసుకుంటున్నారు. ఇక తగ్గిన ధరలు ఆదివారం నుంచే అందుబాటులోకి వచ్చాయి.
ఏపీలో మద్యం ధరలను తగ్గిస్తున్నట్లు శనివారమే ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తాజాగా ఉత్తర్వులను జారీ చేశారు. ఇక తగ్గిన మద్యం ధరల వివరాలను కింద పట్టికలను చూసి తెలుసుకోవచ్చు.
రాష్ట్రంలో వచ్చే వారంలోపు అన్ని మద్యం దుకాణాల్లోనూ ప్రముఖ కంపెనీలకు చెందిన మద్యం బ్రాండ్లను విక్రయించేలా చర్యలు తీసుకోవాలని కూడా ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా ఏపీలో మద్యం వినియోగం తగ్గిందని చెబుతున్న ప్రభుత్వం ఉన్న ఫలంగా ఇలా మద్యం ధరలను తగ్గించడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలా మద్యం ధరలను తగ్గిస్తే మళ్లీ మద్యం వినియోగం పెరుగుతుంది కదా.. అని అంటున్నారు. మరి మద్య నిషేధాన్ని అమలు చేయాలన్న ఏపీ ప్రభుత్వం సడెన్గా మద్యం ధరలను ఎందుకు తగ్గించిందో.. దీని వెనుక ఉన్న కారణం ఏమిటో.. అందుకు కాలమే సమాధానం చెప్పాలి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…