ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసుతోపాటు పలు ఇతర కేసుల్లో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలయ్యారు. అంబటి రాంబాబుకు అన్ని కేసుల్లోనూ గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేయగా ఆయన బుధవారం (ఫిబ్రవరి 18, 2026) జైలు నుంచి రిలీజ్ అయ్యారు. అంబటి రాంబాబు ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై పోలీసులు 36 కేసులు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై మరో 16 కేసులు నమోదయ్యాయి. అలాగే సత్తెనపల్లి సంక్రాంతి సంబరాల లక్కీ డ్రాలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై కూడా అంబటిపై కేసు నమోదు అయింది. అయితే ఈ కేసులన్నింటిలోనూ ఆయనకు బెయిల్ లభించడంతో జైలు నుంచి బయటకు వచ్చారు.
జైలు నుంచి విడుదల అయిన అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ తనపై దాడులకు పాల్పడ్డారని, తనను హింసించారని ఆరోపించారు. తన భార్య, పిల్లల్ని తరిమారని, తన కార్లను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. తన ఇల్లు తగలబెట్టేందుకు యత్నించారని, అయినప్పటికీ తాను పట్టించుకోనని అన్నారు. తాను ఒక బాధితుడిని అయితే బాధితుడిని జైలులో పెట్టి నిందితులను వదిలేశారని ఆరోపించారు. పార్టీలకు అతీతంగా తనకు మద్దతు ఇచ్చిన వారికి అంబటి కృజ్ఞతలు తెలిపారు. తనపై జరిగిన దాడిని ఖండించిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. దేవుడు ఉన్నాడని, ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా అంబటి తన ఎక్స్ ఖాతాలోనూ పోస్టు పెట్టారు. ఎన్ని కేసులు పెట్టినా అడుగు వెనక్కి వేసేది లేదు, వైఎస్ జగన్ నాయకత్వంలో కూటమిని కూల్చేవరకు తన పోరాటం ఆగదని తెలిపారు.
ఇటీవలి కాలంలో చాలా వరకు సినిమాలకు గాను షూటింగ్ స్పాట్ నుంచే హీరోలు లేదా ఇతర నటీనటులకు చెందిన ఫొటోలు,…
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 హామీలను అసలు అమలు చేయలేదని, రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా సరే…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్లలోనూ…
సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అభిషేక్ శర్మకు కాకుండా ఇషాన్ కిషన్ కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించడం తనను నిరాశకు గురి…
పాన్ వరల్డ్ మూవీగా అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న రామాయణ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ను ఇటీవలే రిలీజ్ చేసిన విషయం…
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తన కుమారుడు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగపూరిత సందేశాన్ని సోషల్ మీడియాలో…
నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తమిళనాడు వాసి అయినప్పటికీ పలు ఇతర భాషల్లోనూ చిత్రాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. గతంలో ఆమె…
మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్కు టాలీవుడ్లో తొలి మూవీలోనే చేదు అనుభవం ఎదురైంది.ఆమె నటించిన రాజాసాబ్ మూవీ అట్టర్ ఫ్లాప్గా…