కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ (MeitY) శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కామన్ సర్వీస్ సెంటర్స్ (CSC) ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆధార్ ఆపరేటర్, సూపర్వైజర్ పోస్టులకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు సీఎస్సీ ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియన్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నియామక ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 252 ఆధార్ ఆపరేటర్, సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 11, 2026న ప్రారంభం కాగా మార్చి 10, 2026 వరకు గడువు విధించారు. అభ్యర్థులు సీఎస్సీ ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియన్ వెబ్సైట్ csc.gov.inను సందర్శించి ఈ పోస్టులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. సెమి-స్కిల్డ్ మ్యాన్ పవర్డ్ విభాగంను బట్టి ఎంపికైన అభ్యర్థులకు నెలవారి వేతనాలు ఉంటాయి. అభ్యర్థులను అర్హత, అప్లికేషన్లు, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అనంతరం ఎంపిక చేసిన ఆధార్ సేవా కేంద్ర (ASK)లో పోస్టులో నియమిస్తారు.
ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు కేవలం ఆన్ లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ దరఖాస్తులను స్వీకరించరు.
గమనిక: అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ను లేదా అధికారిక వెబ్సైట్ను సందర్శించి సమాచారాన్ని ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. అధికారిక సైట్లో ఎప్పటికప్పుడు వచ్చే అప్డేట్స్ను పరిశీలించాల్సి ఉంటుంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 హామీలను అసలు అమలు చేయలేదని, రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా సరే…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్లలోనూ…
సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అభిషేక్ శర్మకు కాకుండా ఇషాన్ కిషన్ కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించడం తనను నిరాశకు గురి…
పాన్ వరల్డ్ మూవీగా అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న రామాయణ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ను ఇటీవలే రిలీజ్ చేసిన విషయం…
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తన కుమారుడు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగపూరిత సందేశాన్ని సోషల్ మీడియాలో…
నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తమిళనాడు వాసి అయినప్పటికీ పలు ఇతర భాషల్లోనూ చిత్రాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. గతంలో ఆమె…
మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్కు టాలీవుడ్లో తొలి మూవీలోనే చేదు అనుభవం ఎదురైంది.ఆమె నటించిన రాజాసాబ్ మూవీ అట్టర్ ఫ్లాప్గా…
దర్శకుడు నితేశ్ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రామాయణ టీజర్ విడుదలైంది. ఈ టీజర్లో రాముడిగా రణబీర్ కపూర్ తొలి…