Anasuya : సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే సీనియర్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ చేసిన తాజా ట్వీట్ కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో తను ఏం చేసినా, ఏం మాట్లాడినా దాన్ని రాజకీయం చేస్తున్నారంటూ ఇటీవల వాపోయిన అనసూయ తాజాగా ఓ సంచలన ట్వీట్ చేసింది. విజయ్ దేవరకొండ.. అనసూయ భరద్వాజ్ మధ్య అర్జున్ రెడ్డి సినిమా విషయంలో చేలరేగిన వివాదం మళ్లీ వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమా సమయంలో విజయ్ దేవరకొండ – అనసూయ భరద్వాజ్ మధ్య సోషల్ మీడియాలో ఓ పెద్ద వార్ జరిగింది.
సినిమా ప్రమోషనల్ స్టైల్ నచ్చకపోవడంతో అప్పట్లో అనసూయ భరద్వాజ్ విజయ్ దేవరకొండను, సినిమాలో అసభ్యతను టార్గెట్ చేసి విమర్శించింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ ప్రత్యక్షంగా ఎలాంటి కామెంట్స్ చేయకపోయినా పరోక్షంగా ఆమెకు కౌంటర్లు ఇస్తూనే ఉన్నాడు. అప్పట్లో ఈ వివాదం చాలా దూరం వెళ్ళింది. అయితే అర్జున్ రెడ్డి విడుదలై ఇప్పటికి 5 ఏళ్లు అవుతోంది. ఇప్పుడు అదే రోజున లైగర్ సినిమా థియేటర్స్లోకి వచ్చింది. అయితే లైగర్ మూవీకి మార్నింగ్ షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. సోషల్ మీడియాలో పూరీని, విజయ్ ని ప్రేక్షకులు ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. లైగర్ విషయంలో ఇంత వరెస్టు రిజల్ట్ను ఎవరూ ఊహించలేదు.
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కి ఇది ఊహించని షాక్. ఈ నేపథ్యంలో అనసూయ లైగర్ సినిమా పేరుని ప్రస్తావించకుండా ఇన్డైరెక్ట్గా టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసింది. అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కానీ రావటం మాత్రం పక్కా!! #NotHappyOnsomeonesSadness but #FaithRestored అని ట్వీట్ చేసింది. అసలే సినిమా దొబ్బిందని ఫ్రాస్ట్రేషన్ లో ఉన్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయను బూతులు తిడుతున్నారు. మరికొందరైతే ఆర్టికల్ లో రాయలేని విధంగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఆమె ట్విట్టర్ లో పోస్ట్ లు చూస్తే మీకే అర్థమవుతుంది. దీనిపై విజయ్ స్పందిస్తాడో లేక ఇంతకు ముందులాగే టైం కోసం వైట్ చేసి పరోక్షంగా కౌంటర్లు వేస్తాడో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…