Anasuya : సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే సీనియర్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ చేసిన తాజా ట్వీట్ కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో తను ఏం చేసినా, ఏం మాట్లాడినా దాన్ని రాజకీయం చేస్తున్నారంటూ ఇటీవల వాపోయిన అనసూయ తాజాగా ఓ సంచలన ట్వీట్ చేసింది. విజయ్ దేవరకొండ.. అనసూయ భరద్వాజ్ మధ్య అర్జున్ రెడ్డి సినిమా విషయంలో చేలరేగిన వివాదం మళ్లీ వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమా సమయంలో విజయ్ దేవరకొండ – అనసూయ భరద్వాజ్ మధ్య సోషల్ మీడియాలో ఓ పెద్ద వార్ జరిగింది.
సినిమా ప్రమోషనల్ స్టైల్ నచ్చకపోవడంతో అప్పట్లో అనసూయ భరద్వాజ్ విజయ్ దేవరకొండను, సినిమాలో అసభ్యతను టార్గెట్ చేసి విమర్శించింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ ప్రత్యక్షంగా ఎలాంటి కామెంట్స్ చేయకపోయినా పరోక్షంగా ఆమెకు కౌంటర్లు ఇస్తూనే ఉన్నాడు. అప్పట్లో ఈ వివాదం చాలా దూరం వెళ్ళింది. అయితే అర్జున్ రెడ్డి విడుదలై ఇప్పటికి 5 ఏళ్లు అవుతోంది. ఇప్పుడు అదే రోజున లైగర్ సినిమా థియేటర్స్లోకి వచ్చింది. అయితే లైగర్ మూవీకి మార్నింగ్ షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. సోషల్ మీడియాలో పూరీని, విజయ్ ని ప్రేక్షకులు ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. లైగర్ విషయంలో ఇంత వరెస్టు రిజల్ట్ను ఎవరూ ఊహించలేదు.
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కి ఇది ఊహించని షాక్. ఈ నేపథ్యంలో అనసూయ లైగర్ సినిమా పేరుని ప్రస్తావించకుండా ఇన్డైరెక్ట్గా టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసింది. అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కానీ రావటం మాత్రం పక్కా!! #NotHappyOnsomeonesSadness but #FaithRestored అని ట్వీట్ చేసింది. అసలే సినిమా దొబ్బిందని ఫ్రాస్ట్రేషన్ లో ఉన్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయను బూతులు తిడుతున్నారు. మరికొందరైతే ఆర్టికల్ లో రాయలేని విధంగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఆమె ట్విట్టర్ లో పోస్ట్ లు చూస్తే మీకే అర్థమవుతుంది. దీనిపై విజయ్ స్పందిస్తాడో లేక ఇంతకు ముందులాగే టైం కోసం వైట్ చేసి పరోక్షంగా కౌంటర్లు వేస్తాడో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…