Acharya Movie : చిరంజీవి, రామ్చరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డె చిన్న పాత్ర పోషించింది. రామ్చరణ్కి జోడీగా చేసింది. చిరంజీవికి జోడీగా కాజల్ జత కట్టిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 29న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ప్రమోషన్స్లో ఎక్కడ కూడా కాజల్ ప్రస్తావన రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ట్రైలర్లో కాజల్ని ఎక్కడా చూపించని చిత్ర బందం, ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమె ఊసే ఎత్తలేదు.
దర్శకుడు కొరటాల శివ నుంచి మొదలు పెట్టి చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డె ఎవరూ అసలు కాజల్ గురించి మాట్లాడలేదు. దీంతో ఫ్యాన్స్ రకరకాల అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా ? లేదంటే కావాలనే కాజల్ పేరు మరిచిపోయారా.. అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం దర్శకుడు కొరటాల శివ ఆమె పాత్రను పూర్తిగా తొలగించినట్టు తెలుస్తోంది. కథానుగుణంగానే ఆమె సన్నివేశాలని తొలగించారని అంటున్నారు. అయితే లాహె లాహె సాంగ్లోని రెండు మూడు సీన్స్లో ఆమె ఉంటుందని తెలుస్తోంది.
కాజల్ని హీరోయిన్గా ఎంపిక చేసిన తర్వాత చిత్ర బృందం ఆమెతో ఎక్కువ సన్నివేశాలను చిత్రీకరించలేదు. అభిమానులని నిరాశపరచకుండా కాస్త గ్లామర్ ట్రీట్ ఇచ్చేందుకు రెజీనాని తీసుకొచ్చారు. సినిమాలో హీరోయిన్ పార్ట్ని తొలగించి, ఆచార్యను బ్రహ్మచారిగా చూపించాలన్న కొరటాల నిర్ణయానికి చిరంజీవి కూడా అంగీకరించినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కాజల్ సన్నివేశాలని ఆచార్య నుండి తొలగించినట్టు టాక్. శనివారం హైదరాబాద్లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిరంజీవి తదుపరి చిత్రాల దర్శకులు బాబీ, మెహర్ రమేష్, మోహన్ రాజా కూడా అతిథిలుగా ఈ ఈవెంట్ కి హాజరయ్యారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…