Acharya Movie : చిరంజీవి, రామ్చరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డె చిన్న పాత్ర పోషించింది. రామ్చరణ్కి జోడీగా చేసింది. చిరంజీవికి జోడీగా కాజల్ జత కట్టిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 29న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ప్రమోషన్స్లో ఎక్కడ కూడా కాజల్ ప్రస్తావన రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ట్రైలర్లో కాజల్ని ఎక్కడా చూపించని చిత్ర బందం, ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమె ఊసే ఎత్తలేదు.
దర్శకుడు కొరటాల శివ నుంచి మొదలు పెట్టి చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డె ఎవరూ అసలు కాజల్ గురించి మాట్లాడలేదు. దీంతో ఫ్యాన్స్ రకరకాల అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా ? లేదంటే కావాలనే కాజల్ పేరు మరిచిపోయారా.. అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం దర్శకుడు కొరటాల శివ ఆమె పాత్రను పూర్తిగా తొలగించినట్టు తెలుస్తోంది. కథానుగుణంగానే ఆమె సన్నివేశాలని తొలగించారని అంటున్నారు. అయితే లాహె లాహె సాంగ్లోని రెండు మూడు సీన్స్లో ఆమె ఉంటుందని తెలుస్తోంది.
కాజల్ని హీరోయిన్గా ఎంపిక చేసిన తర్వాత చిత్ర బృందం ఆమెతో ఎక్కువ సన్నివేశాలను చిత్రీకరించలేదు. అభిమానులని నిరాశపరచకుండా కాస్త గ్లామర్ ట్రీట్ ఇచ్చేందుకు రెజీనాని తీసుకొచ్చారు. సినిమాలో హీరోయిన్ పార్ట్ని తొలగించి, ఆచార్యను బ్రహ్మచారిగా చూపించాలన్న కొరటాల నిర్ణయానికి చిరంజీవి కూడా అంగీకరించినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కాజల్ సన్నివేశాలని ఆచార్య నుండి తొలగించినట్టు టాక్. శనివారం హైదరాబాద్లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిరంజీవి తదుపరి చిత్రాల దర్శకులు బాబీ, మెహర్ రమేష్, మోహన్ రాజా కూడా అతిథిలుగా ఈ ఈవెంట్ కి హాజరయ్యారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…