Viral Video : ఫోన్లో మాట్లాడుతూ రహదారిపై నడిచి వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా వాహనం వెనుక నుంచి వచ్చి ఢీకొనవచ్చు. లేదా ఇంకేదైనా ప్రమాదం జరగవచ్చు. అయితే ఇలాంటి ప్రమాదాన్ని ఆమె ఊహించలేదు. ఈ క్రమంలోనే ఆమె రహదారిపై నడుచుకుంటూ వెళ్తూ ఫోన్లో మాట్లాడుతూ అలాగే ముందుకు వెళ్లింది. తరువాత అక్కడే ఉన్న మ్యాన్హోల్లో దురదృష్టవశాత్తూ పడిపోయింది. అయితే రద్దీగా ఉన్న ప్రదేశం కనుక వెంటనే ఆమెను రక్షించారు. లేదంటే ఆమె ప్రాణాలు కోల్పోయి ఉండేది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
బీహార్ లోని పాట్నాలో ఉన్న 56వ వార్డులోని మాలియా మహాదేవ్ జల్లా అనే పేరున్న రోడ్డులో ఓ మహిళ ఫోన్లో మాట్లాడుతూ రహదారిపై నడుచుకుంటూ వెళ్తోంది. అయితే ఆమె ముందు ఓ ఇ-రిక్షా ఉంది. దీంతో ఆ రిక్షా వెళ్లగానే దాని వెనుకే ఆమె రోడ్డు మీద ముందుకు వెళ్లింది. అయితే ఆమె ఫోన్లో మాట్లాడుతున్న కారణంగా కిందకు చూడలేదు. దిక్కులు చూస్తూ ముందుకు నడిచింది. దీంతో అక్కడే తెరిచి ఉన్న ఓ మ్యాన్హోల్లో ఆమె పడిపోయింది.
అయితే ఆమె అలా మ్యాన్హోల్లో పడగానే చుట్టూ ఉన్న కొందరు వెంటనే పరిగెత్తుకుని వచ్చారు. హుటాహుటిన ఆమెను బయటకు లాగారు. తరువాత ఆమె పక్కనే ఉండి వ్యర్థాలను శుభ్రం చేసుకుంది. ఈ క్రమంలోనే ఆ మ్యాన్హోల్లో ఎవరూ పడకుండా అక్కడి వారు దానిపై మూత పెట్టి కవర్ చేశారు. ఇక అదే సమయంలో అక్కడ ఉన్న సీసీకెమెరాల్లో ఈ సంఘటన రికార్డు అయింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా అక్కడ ఇటీవల మ్యాన్హోల్ పనులు చేశారని.. కానీ మూత పెట్టలేదని.. పాట్నాలో ఇలా అనేక చోట్ల ఉన్నాయని.. తాము ఫిర్యాదు చేసినా మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవడం లేదని.. స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…