Viral Video : ఫోన్లో మాట్లాడుతూ రహదారిపై నడిచి వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా వాహనం వెనుక నుంచి వచ్చి ఢీకొనవచ్చు. లేదా ఇంకేదైనా ప్రమాదం జరగవచ్చు. అయితే ఇలాంటి ప్రమాదాన్ని ఆమె ఊహించలేదు. ఈ క్రమంలోనే ఆమె రహదారిపై నడుచుకుంటూ వెళ్తూ ఫోన్లో మాట్లాడుతూ అలాగే ముందుకు వెళ్లింది. తరువాత అక్కడే ఉన్న మ్యాన్హోల్లో దురదృష్టవశాత్తూ పడిపోయింది. అయితే రద్దీగా ఉన్న ప్రదేశం కనుక వెంటనే ఆమెను రక్షించారు. లేదంటే ఆమె ప్రాణాలు కోల్పోయి ఉండేది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
బీహార్ లోని పాట్నాలో ఉన్న 56వ వార్డులోని మాలియా మహాదేవ్ జల్లా అనే పేరున్న రోడ్డులో ఓ మహిళ ఫోన్లో మాట్లాడుతూ రహదారిపై నడుచుకుంటూ వెళ్తోంది. అయితే ఆమె ముందు ఓ ఇ-రిక్షా ఉంది. దీంతో ఆ రిక్షా వెళ్లగానే దాని వెనుకే ఆమె రోడ్డు మీద ముందుకు వెళ్లింది. అయితే ఆమె ఫోన్లో మాట్లాడుతున్న కారణంగా కిందకు చూడలేదు. దిక్కులు చూస్తూ ముందుకు నడిచింది. దీంతో అక్కడే తెరిచి ఉన్న ఓ మ్యాన్హోల్లో ఆమె పడిపోయింది.
అయితే ఆమె అలా మ్యాన్హోల్లో పడగానే చుట్టూ ఉన్న కొందరు వెంటనే పరిగెత్తుకుని వచ్చారు. హుటాహుటిన ఆమెను బయటకు లాగారు. తరువాత ఆమె పక్కనే ఉండి వ్యర్థాలను శుభ్రం చేసుకుంది. ఈ క్రమంలోనే ఆ మ్యాన్హోల్లో ఎవరూ పడకుండా అక్కడి వారు దానిపై మూత పెట్టి కవర్ చేశారు. ఇక అదే సమయంలో అక్కడ ఉన్న సీసీకెమెరాల్లో ఈ సంఘటన రికార్డు అయింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా అక్కడ ఇటీవల మ్యాన్హోల్ పనులు చేశారని.. కానీ మూత పెట్టలేదని.. పాట్నాలో ఇలా అనేక చోట్ల ఉన్నాయని.. తాము ఫిర్యాదు చేసినా మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవడం లేదని.. స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…