OTT : ప్రతి వారం మారగానే ఓటీటీ యాప్లు కొత్త కొత్త మూవీలు, సిరీస్లను రిలీజ్ చేస్తూ సందడి చేస్తున్నాయి. ఇక ఈ వారం కూడా పలు మూవీలు, సిరీస్లు విడుదల కానున్నాయి. ఈ క్రమంలోనే వారం మారాక ప్రేక్షకులు కూడా కొత్త సినిమాలు, సిరీస్ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ వారంలో ఓటీటీ యాప్లలో స్ట్రీమ్ కానున్న సినిమాలు, సిరీస్లు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలియా భట్ నటించిన గంగూబాయి కతియవాడి మూవీ ఈ వారం స్ట్రీమ్ కానుంది. సంజయ్ లీలా భన్సాలి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ ఏప్రిల్ 26 నుంచి నెట్ఫ్లిక్స్, జీ5లలో స్ట్రీమ్ కానుంది.
ఇక తాప్సీ నటించిన మిషన్ ఇంపాజిబుల్ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ సినిమాను థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కించారు. ఇది నెట్ఫ్లిక్స్లోనే ఏప్రిల్ 29 నుంచి స్ట్రీమ్ అవుతుంది.
టామ్ హాలండ్ నటించిన అన్చార్టెడ్ ఈ నెల 28వ తేదీ నుంచి బుక్ మై షోలో స్ట్రీమ్ కానుంది. యాక్షన్ అడ్వెంచర్ జోనర్లో దీన్ని తెరకెక్కించారు. అలాగే ఒజార్క్ సిరీస్లో సీజన్ 4 పార్ట్ 2 ను నెట్ఫ్లిక్స్లో ప్రసారం చేయనున్నారు. ఏప్రిల్ 29 నుంచి స్ట్రీమ్ అవుతుంది. దీంతోపాటు నెవర్ కిస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ సిరీస్కు చెందిన సీజన్ 2ను జీ5 లో ఈ నెల 29వ తేదీ నుంచి స్ట్రీమ్ చేయనున్నారు. ఈ వారం ఓటీటీల్లో గంగూబాయి, మిషన్ ఇంపాజిబుల్ తప్ప చెప్పుకోదగిన చిత్రాలు ఏమీ లేవనే చెప్పాలి.
ఇక థియేటర్లలో ఈ వారం పలు సినిమాలు సందడి చేయనున్నాయి. రామ్ చరణ్, చిరంజీవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఆచార్య మూవీ ఈ నెల 29వ తేదీన విడుదల కానుండగా.. సమంత, నయనతార, విజయ్ సేతుపతిలు ప్రధాన పాత్రల్లో నిర్మించబడిన కాతు వాకుల రెండు కాదల్ మూవీ ఈ నెల 28న విడుదల కానుంది. అలాగే అజయ్ దేవగన్, అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన రన్ వే 34 చిత్రం కూడా ఏప్రిల్ 29వ తేదీనే విడుదల కానుంది.
మధుమేహంతో జీవిస్తున్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం పెద్ద సవాలే. అయితే రోజువారీ ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేస్తే…
భారత్తో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ బహిష్కరణపై చివరికి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. భారత్-పాకిస్థాన్ మధ్య…
మార్చి నెల బాక్సాఫీస్ పోరు నుంచి రెండు పెద్ద సినిమాలు తప్పుకోగా, ఆ స్థానాన్ని ఇప్పుడు పవర్ స్టార్ పవన్…
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవకతవకలు వరుసగా బయటపడుతున్నాయని, తాజాగా రూ.6 వేల కోట్ల విలువైన…
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా…
2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో…
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…