Aaradugula Bullet : గోపీచంద్ ఇటీవలి కాలంలో నటించిన సినిమాలు ఏవీ అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ఈ మధ్యే రిలీజ్ అయిన సీటీమార్ మూవీ కొంత మేరకు ఫర్వాలేదనుకున్నా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేదు. ఇక ఎప్పుడో 4 ఏళ్ల కింద రిలీజ్ కావల్సిన ఆరడుగుల బుల్లెట్ మూవీని ఈ మధ్యే రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీ వచ్చి వెళ్లినట్లు కూడా చాలా మందికి తెలియదు.
కాగా ఆరడుగుల బుల్లెట్ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతోంది. ప్రేక్షకులు ఈ మూవీని అమెజాన్లో వీక్షించవచ్చు. ఇందులో గోపీచంద్ సరసన నయనతార నటించింది. 4 ఏళ్ల కిందట రిలీజ్ కావల్సిన ఈ మూవీ ఆర్థిక సమస్యల కారణంగా విడుదల కాలేదు. అయితే తాజాగా థియేటర్లలో విడుదలైనా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
ఇక గోపీచంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే సినిమాలో నటిస్తున్నారు. రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో సక్సెస్ఫుల్ బ్యానర్స్ జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఈ మూవీతో అయినా గోపీచంద్ హిట్ కొడతాడో లేదో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…