Aaradugula Bullet : గోపీచంద్ ఇటీవలి కాలంలో నటించిన సినిమాలు ఏవీ అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ఈ మధ్యే రిలీజ్ అయిన సీటీమార్ మూవీ కొంత మేరకు ఫర్వాలేదనుకున్నా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేదు. ఇక ఎప్పుడో 4 ఏళ్ల కింద రిలీజ్ కావల్సిన ఆరడుగుల బుల్లెట్ మూవీని ఈ మధ్యే రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీ వచ్చి వెళ్లినట్లు కూడా చాలా మందికి తెలియదు.
కాగా ఆరడుగుల బుల్లెట్ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతోంది. ప్రేక్షకులు ఈ మూవీని అమెజాన్లో వీక్షించవచ్చు. ఇందులో గోపీచంద్ సరసన నయనతార నటించింది. 4 ఏళ్ల కిందట రిలీజ్ కావల్సిన ఈ మూవీ ఆర్థిక సమస్యల కారణంగా విడుదల కాలేదు. అయితే తాజాగా థియేటర్లలో విడుదలైనా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
ఇక గోపీచంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే సినిమాలో నటిస్తున్నారు. రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో సక్సెస్ఫుల్ బ్యానర్స్ జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఈ మూవీతో అయినా గోపీచంద్ హిట్ కొడతాడో లేదో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…