Potatoes : ఆలుగడ్డలను చాలా మంది నిత్యం ఉపయోగిస్తుంటారు. వీటితో అనేక రకాల కూరలు, వంటకాలను చేస్తుంటారు. బిర్యానీ రైస్లలో, మసాలా వంటకాల్లో, ఇతర కూరల్లోనూ ఆలును వేస్తుంటారు. వాస్తవానికి ఆలుగడ్డలు చాలా రుచిగా ఉంటాయి. ఎలా వండినా వీటిని అందరూ ఇష్టంగానే తింటారు. అయితే ఆలుగడ్డలను తింటే మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలిగే మాట వాస్తవమే అయినప్పటికీ వీటిని మోతాదుకు మించి తినరాదు. బంగాళాదుంపలను అధికంగా తినడం వల్ల ప్రయోజనాలు కలగకపోగా నష్టాలే ఎక్కువగా కలుగుతాయి. వీటిని మరీ ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
బంగాళాదుంపలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిని ఉడికించి కొంత మోతాదులో తింటే ఫర్వాలేదు. కానీ వీటితో చిప్స్, టిక్కీ, ఫ్రెంచ్ ఫ్రైస్, మసాలాలు వేసి వండిన కూరలు వంటివి చేసి తింటేనే అనర్థాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇలాంటివి తినడం వల్ల మీరు బరువు పెరుగుతారు. దీంతోపాటు డయాబెటిస్, గుండె జబ్బులు వంటివి వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి.
బంగాళదుంపలను ఎక్కువగా తీసుకోవడం వల్ల అసిడిటీ ఏర్పడవచ్చు మరియు మీకు పుల్లటి త్రేనుపు, గుండెల్లో మంట, కడుపులో గ్యాస్, వాపు మొదలైన సమస్యలు మొదలవుతాయి. బంగాళాదుంపలు తిన్న తర్వాత మీకు జీర్ణ సమస్యలు ఉంటే, దాని తీసుకోవడం తగ్గించడమే కాకుండా, మీరు బంగాళాదుంపలను తయారుచేసేటప్పుడు తక్కువ మసాలాలు మరియు నూనెను కూడా ఉపయోగించాలి.
మధుమేహంతో బాధపడేవారు బంగాళదుంపలను చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది. నిజానికి, బంగాళాదుంపల వినియోగం రక్తంలో చక్కెరను పెంచుతుంది, కాబట్టి బంగాళాదుంపలను ముఖ్యంగా ఖాళీ కడుపుతో మరియు రాత్రిపూట తినకూడదు. అలా తింటే షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదం ఉంటుంది. అయితే మరీ అంతగా తినాలనిపిస్తే వీటిని తినేటప్పుడు ఆహారంలో ప్రోటీన్లు ఉండేలా చూసుకుంటే మంచిది. దీంతో ఎక్కువగా ఆలును తినలేరు. కంట్రోల్లో ఉంటారు. అప్పుడు దీని వల్ల కలిగే నష్టం కూడా తగ్గుతుంది. ఇలా ఆలుగడ్డలను తినే విషయంలో జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందులు తప్పవు అన్న విషయాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…