Kobbari Laddu : సెలవులు వచ్చాయంటే చాలు.. పిల్లలు ఓ వైపు ఆటపాలతో ఎంజాయ్ చేస్తూ.. మరొక వైపు తినుబండారాలను తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే పిల్లలు సహజంగానే జంక్ ఫుడ్ను తినేందుకు ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే సెలవుల్లో వారు అతిగా జంక్ ఫుడ్ తినేందుకు అవకాశం కూడా ఉంటుంది. కనుక అలాంటి అలవాటును పెద్దలు మాన్పించాలి. అందుకు గాను పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన తినుబండారాలను పెద్దలే వారికి చేసి పెట్టాలి. అలాంటి తినుబండారాల్లో కొబ్బరి లడ్డు కూడా ఒకటి. ఈ లడ్డూలలో అనేక పోషకాలు ఉంటాయి. ఈ క్రమంలోనే కొబ్బరి లడ్డూలను ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
కొబ్బరి లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
తాజా కొబ్బరి తురుము – 2 కప్పులు, పాలు – 1/2 కప్పు, చక్కెర – 3/4 కప్పు, యాలకుల పొడి – 1/4 టీ స్పూన్, జీడి పప్పు – గుప్పెడు (చిన్న చిన్న ముక్కలు చేయాలి), నెయ్యి – 1 టీ స్పూన్.
కొబ్బరి లడ్డూ తయారు చేసే విధానం..
బాణలి తీసుకుని స్టౌ మీద ఉంచి వేడి చేయాలి. అనంతరం అందులో నెయ్యి వేసి కరిగించాలి. అందులో జీడిపప్పు ముక్కలు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో కొబ్బరి తురుము, చక్కెర వేసి బాగా కలిపి ఉడకబెట్టాలి. మిశ్రమంలో తడి అంతా పోయి గట్టిపడుతుంది. అనంతరం అందులో యాలకుల పొడి, వేయించుకున్న జీడిపప్పు వేసి బాగా కలిపి దింపాలి. మిశ్రమం మరింత చల్లారాక లడ్డూల మాదిరిగా చేతులతో ఒత్తుకోవాలి. గాలి చొరబడని డబ్బాల్లో లడ్డూలను నిల్వ చేయాలి. ఇలా చేసిన లడ్డూలు 2 లేదా 3 రోజుల వరకు మాత్రమే నిల్వ ఉంటాయి.
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ ఇప్పటికే యూఎస్ఏతో మ్యాచ్ ఆడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు…
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…
విటమిన్లు A, C, Eతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడే పపైన్ ఎంజైమ్తో బొప్పాయి ఎన్నో ఏళ్లుగా…
భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర నటుల మధ్య అల్లు అర్జున్ ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటున్నారు. పారితోషిక విషయంలో ఇతర తెలుగు…
టెలికాం దిగ్గజం జియో కుటుంబ వినియోగదారుల కోసం బడ్జెట్కు అనుకూలమైన కొత్త పోస్ట్పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.449…
2023లో జపాన్కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ అనాన్ కవర్పై రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి దర్శనమిచ్చినప్పుడు అది తెలుగు…