Gold : అసలు పురాతన కాలం నుంచి భారతీయులకు బంగారం అంటే మక్కువ ఎక్కువ. మహిళలకైతే బంగారం అంటే ఎంత ఇష్టం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో ప్రస్తుతం అనేక మంది వ్యాపారులు జ్యువెల్లరీ షాపులను ఏర్పాటు చేస్తూ రక రకాల ఆఫర్లతో జనాలను ఆకట్టుకుంటూ బంగారాన్ని విక్రయిస్తున్నారు. అయితే బంగారం అంటే భారతీయులకు ఇష్టం సరే.. మరి ప్రపంచ వ్యాప్తంగా అసలు ఏ దేశం వారి వద్ద బంగారం ఎక్కువగా ఉందో తెలుసా..? అదే ఇప్పుడు చూద్దాం.
ప్రపంచంలో అన్ని దేశాల కన్నా భారతీయుల వద్దే బంగారం ఎక్కువగా ఉందట. అవును, మీరు విన్నది నిజమే. భారత్లోని సంపన్నుల దగ్గరే ప్రపంచంలోని అందరి కన్నా ఎక్కువగా బంగారం ఉందట. ఈ క్రమంలోనే భారత్లోని అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో బంగారం వాటాలు ఎక్కువగా ఉన్నాయని తాజా గణాంకాలు చెబుతున్నాయి. అలాగే చాలా మంది స్టాక్ మార్కెట్ కన్నా బంగారంపైనే ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారట.
ఇక బంగారంపై పెట్టుబడులు పెడుతున్న వారిలో 14 శాతం మంది ఈ ఏడాదిలో ఆ పెట్టుబడుల సంఖ్యను మరింత పెంచుతారని కూడా ఓ సర్వేలో తేలింది. గతేడాది కన్నా ఇది 3 శాతం ఎక్కువట. కాగా ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో బంగారం లెక్కలు చూస్తే గ్లోబల్ యావరేజ్ 2 శాతం ఉండగా, ఆసియా యావరేజ్ 3 శాతం ఉందట. అలాగే భారతీయ సంపన్నుల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో బంగారం వాటా 4 శాతం ఉండడం గమనార్హం.
కాగా చాలా మంది బంగారంపై పెట్టే పెట్టుబడిని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తుంటారు. నిజానికి ఇతర పెట్టుబడుల్లో ఉన్నట్లుగానే బంగారం ధరల విషయంలోనూ అస్థిరత ఉంటుంది. కానీ దీర్ఘకాలికంగా బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి కనుక బంగారంపై పెట్టుబడి పెడితే ఎప్పటికైనా లాభాలే వస్తాయి. అందుకనే భారతీయ సంపన్నులు చాలా మంది బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు.
ఇక మన దేశంలో అనేక వర్గాలకు చెందిన సంస్కృతి, సాంప్రదాయాల్లో బంగారానికి విశేషమైన ప్రాధాన్యత కల్పించారు. దీంతో మన దేశంలో బంగారం వినియోగదారులు మిగిలిన దేశాల కన్నా ఎక్కువగానే ఉంటారు. అయితే ప్రపంచంలో అందరికన్నా మన దేశీయుల వద్దనే బంగారం ఎక్కువగా ఉన్నప్పటికీ చాలా మంది అవసరం ఉంటేనే భౌతికంగా బంగారం కొనుగోలు చేస్తున్నారట. అవసరం లేకపోతే బంగారం బాండ్స్ వైపు చూస్తున్నారట. బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారట.. ఏది ఏమైనా.. భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో మరోసారి రుజువైంది కదా..!
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…