Watermelon Smoothie : వేసవిలో పుచ్చకాయలను తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. పుచ్చకాయల వల్ల మన శరీరానికి చల్లదనం అందుతుంది. అలాగే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. దీంతోపాటు పలు ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్ మనకు పుచ్చకాయల ద్వారా లభిస్తాయి. అయితే పుచ్చకాయలను నేరుగా తినడంతోపాటు దాంతో చల్ల చల్లగా స్మూతీ తయారు చేసుకుని తాగినా.. మనకు అవే లాభాలు కలుగుతాయి. ఈ క్రమంలోనే వాటర్మిలన్ స్మూతీని ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వాటర్మిలన్ స్మూతీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పుచ్చకాయ ముక్కలు (విత్తనాలు తీసి కట్ చేయబడినవి) – ఒకటిన్నర కప్పు, స్ట్రాబెర్రీలు – ఒక కప్పు, బాగా పండిన అరటి పండు – సగం, బాదం పాలు – 1/2 నుంచి 3/4 కప్పు, నిమ్మరసం – 1 టీస్పూన్, చియా విత్తనాలు – 1 టేబుల్ స్పూన్.
వాటర్ మిలన్ స్మూతీ తయారు చేసే విధానం..
పైన చెప్పిన అన్ని పదార్థాలను బ్లెండర్లో వేసి చక్కని చిక్కని స్మూతీ వచ్చేలా పట్టుకోవాలి. అవసరం అనుకుంటే బాదం పాలను ఎక్కువగా పోయవచ్చు. లేదా స్ట్రాబెర్రీలు, ఐస్ వేసుకోవచ్చు. ఇక టేస్ట్ కోసం నిమ్మరసం కలుపుకోవచ్చు. తియ్యగా ఉండాలనుకుంటే అరటి పండు మోతాదు పెంచవచ్చు. లేదా పుచ్చకాయ ముక్కలు మరిన్ని వేసుకోవచ్చు. దీంతో వాటర్ మిలన్ ఫ్లేవర్ ఎక్కువగా వస్తుంది. ఈ స్మూతీపై అలంకరణ కోసం చియా సీడ్స్ వేయవచ్చు. దీంతో చల్ల చల్లని వాటర్ మిలన్ స్మూతీ తయారు అవుతుంది. దీన్ని 2, 3 రోజుల వరకు ఫ్రిజ్లో నిల్వ ఉంచి తాగవచ్చు.
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ ఇప్పటికే యూఎస్ఏతో మ్యాచ్ ఆడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు…
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…
విటమిన్లు A, C, Eతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడే పపైన్ ఎంజైమ్తో బొప్పాయి ఎన్నో ఏళ్లుగా…
భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర నటుల మధ్య అల్లు అర్జున్ ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటున్నారు. పారితోషిక విషయంలో ఇతర తెలుగు…
టెలికాం దిగ్గజం జియో కుటుంబ వినియోగదారుల కోసం బడ్జెట్కు అనుకూలమైన కొత్త పోస్ట్పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.449…
2023లో జపాన్కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ అనాన్ కవర్పై రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి దర్శనమిచ్చినప్పుడు అది తెలుగు…