Tea Masala : టీ అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టం. వేసవిలో కూడా టీ ఎక్కువగా తాగే వారు చాలా మందే ఉంటారు. ఇక చల్లని వాతావరణం ఉంటే అలాంటి వారికి పండగే అని చెప్పవచ్చు. చల్లని వాతావరణంలో టీ తాగితే ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇక వర్షాకాలంలో టీ తాగడం ఎంతో అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. కొందరు మార్కెట్లో లభించే మసాలా టీ తెచ్చుకుని టీ తయారు చేసి తాగుతారు. అయితే కొందరు దీన్ని ఇంట్లోనే తయారు చేస్తారు. కాస్త శ్రమించాలే కానీ మసాలా పొడిని మనమే ఇంట్లో ఎంతో సులభంగా తయారు చేసి వాడవచ్చు. ఇక చాయ్ మసాలా పొడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఇంట్లో టీ మసాలా చేయడానికి 4 నుండి 5 దాల్చిన చెక్క ముక్కలు, అల్లం బదులుగా పొడి అల్లం (సగం గిన్నె), పచ్చి యాలకులు (కనీసం 8 నుండి 10), జాజికాయ పొడి (2 చిటికెలు), ఒక టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు, సగం టేబుల్ స్పూన్ లవంగాలు, సగం టీస్పూన్ సోంపు అవసరం అవుతాయి.
ముందుగా ఎండు అల్లం ముక్కలను దంచి గ్రైండర్లో వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ను కొద్దిగా వేడి చేసి, అందులో మొత్తం మసాలా దినుసులను పొడిగా వేయించాలి. సువాసన రావడం ప్రారంభించినప్పుడు, ఒక ప్లేట్లో మసాలా దినుసులను తీసి, కొద్దిగా చల్లారిన తర్వాత వాటిని గ్రైండర్లో వేసి మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు ఎండు అల్లం పొడిలో మసాలా దినుసులను వేసి జాజికాయ పొడిని కూడా వేయాలి. ఇలా చేస్తే టీ మసాలా రెడీ అవుతుంది. దీన్ని మీరు టీ తయారు చేసేటప్పుడు నీటిలో వేసి కాస్త మరిగించి అనంతరం టీ తయారు చేసి తాగితే చాలు. టీ ఎంతో రుచిగా ఉంటుంది. ఈ టీని సేవించడం వల్ల రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. రెండూ కలుగుతాయి.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవకతవకలు వరుసగా బయటపడుతున్నాయని, తాజాగా రూ.6 వేల కోట్ల విలువైన…
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా…
2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో…
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…