Tea Masala : టీ అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టం. వేసవిలో కూడా టీ ఎక్కువగా తాగే వారు చాలా మందే ఉంటారు. ఇక చల్లని వాతావరణం ఉంటే అలాంటి వారికి పండగే అని చెప్పవచ్చు. చల్లని వాతావరణంలో టీ తాగితే ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇక వర్షాకాలంలో టీ తాగడం ఎంతో అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. కొందరు మార్కెట్లో లభించే మసాలా టీ తెచ్చుకుని టీ తయారు చేసి తాగుతారు. అయితే కొందరు దీన్ని ఇంట్లోనే తయారు చేస్తారు. కాస్త శ్రమించాలే కానీ మసాలా పొడిని మనమే ఇంట్లో ఎంతో సులభంగా తయారు చేసి వాడవచ్చు. ఇక చాయ్ మసాలా పొడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఇంట్లో టీ మసాలా చేయడానికి 4 నుండి 5 దాల్చిన చెక్క ముక్కలు, అల్లం బదులుగా పొడి అల్లం (సగం గిన్నె), పచ్చి యాలకులు (కనీసం 8 నుండి 10), జాజికాయ పొడి (2 చిటికెలు), ఒక టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు, సగం టేబుల్ స్పూన్ లవంగాలు, సగం టీస్పూన్ సోంపు అవసరం అవుతాయి.
ముందుగా ఎండు అల్లం ముక్కలను దంచి గ్రైండర్లో వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ను కొద్దిగా వేడి చేసి, అందులో మొత్తం మసాలా దినుసులను పొడిగా వేయించాలి. సువాసన రావడం ప్రారంభించినప్పుడు, ఒక ప్లేట్లో మసాలా దినుసులను తీసి, కొద్దిగా చల్లారిన తర్వాత వాటిని గ్రైండర్లో వేసి మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు ఎండు అల్లం పొడిలో మసాలా దినుసులను వేసి జాజికాయ పొడిని కూడా వేయాలి. ఇలా చేస్తే టీ మసాలా రెడీ అవుతుంది. దీన్ని మీరు టీ తయారు చేసేటప్పుడు నీటిలో వేసి కాస్త మరిగించి అనంతరం టీ తయారు చేసి తాగితే చాలు. టీ ఎంతో రుచిగా ఉంటుంది. ఈ టీని సేవించడం వల్ల రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. రెండూ కలుగుతాయి.
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్ను ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…