Moringa Leaves Juice : ప్రస్తుత తరుణంలో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. జీవనశైలిలో మార్పులు రావడం ప్రధాన కారణం. అధికంగా బరువు ఉన్నవారు బరువు తగ్గేందుకు అనేక మార్గాలను అనుసరిస్తుంటారు. అందులో భాగంగానే ఆహారం కూడా తీసుకుంటారు. కొందరు జిమ్లో గంటల తరబడి సాధన చేస్తారు. అయినప్పటికీ బరువు తగ్గడం లేదని ఫిర్యాదు చేస్తారు. అయితే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే మీ బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. మునగాకుల రసం బరువు తగ్గడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
మునగాకులు చాలామందికి తెలుసు కానీ అవి బరువును తగ్గిస్తాయని చాలామందికి తెలియదు. బరువు తగ్గించే ప్రయాణంలో ఉన్నవారు మునగాకుల రసాన్ని తప్పకుండా తీసుకోవాలి. మీ డైట్ లో మునగాకుల రసాన్ని చేర్చుకుంటే అనేక లాభాలు ఉంటాయి. మునగాకుల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఎన్నో సంవత్సరాల నుంచి వీటిని ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. మునగాకులో ప్రోటీన్లు, ఫైబర్, క్లోరోజెనిక్ యాసిడ్, మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. అంతేకాకుండా ఇతర వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. మునగాకుల రసాన్ని తీసుకోవడం వల్ల తక్కువ క్యాలరీ లభిస్తాయి. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కనుక మీ పొట్టను చాలా సమయం పాటు నిండుగా ఉన్నట్టు చేస్తుంది. అందువల్ల మీరు తక్కువ ఆహారం తీసుకుంటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.
మునగాకుల రసాన్ని తాగితే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. డయాబెటిస్ నియంత్రణలోకి వస్తుంది. జీవక్రియలు వేగవంతం అవుతాయి. దీంతో బరువు తగ్గడం చాలా తేలిక అవుతుంది. మునగాకుల్లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బరువు తగ్గడంలో కూడా మనకు సహాయపడతాయి. మునగాకుల రసాన్ని తాగితే రోగనిరోధక శక్తి పెరిగి జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. శరీరంలోని వాపులు. నొప్పులు తగ్గుతాయి. బిపి అదుపులోకి వస్తుంది. చర్మం యవ్వనంగా ఉంటుంది, కాంతివంతంగా మారుతుంది. ఇక మునగాకుల రసాన్ని ఎలా తయారు చేయాలంటే.. ముందు మునగ ఆకులను కడగాలి, వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి పేస్టులా పట్టుకోవాలి, తర్వాత దాన్నుంచి రసం తీయాలి, ఆ రసాన్ని ఫిల్టర్ చేసి తాగొచ్చు. అందులో కావాలంటే నిమ్మరసం, తేనె కలిపి కూడా తాగవచ్చు. ఇలా మునగాకుల రసాన్ని తాగితే అధిక బరువు తగ్గుతారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవకతవకలు వరుసగా బయటపడుతున్నాయని, తాజాగా రూ.6 వేల కోట్ల విలువైన…
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా…
2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో…
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…