Skin Problems : వర్షాకాలంలో చాలా మందికి చర్మ సమస్యలు వస్తుంటాయి. వాటిల్లో కురుపులు, మొటిమలు, దురదలు కూడా ఉంటాయి. ముఖ్యంగా చిన్నారులు మురికి నీటిలో ఎక్కువగా ఆడుతారు. కనుక వారికే ఈ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే బ్యాక్టీరియా వల్ల కూడా చర్మ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. దీంతోపాటు కొందరికి ఈ సీజన్లో మొటిమలు ఎక్కువగా వస్తాయి. అయితే పలు సహజసిద్దమైన చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వేప ఆకులు లేదా బెరడు, వేప పండ్లు మనకు వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలను తగ్గించడంలో ఎంతగానో పనిచేస్తాయి. కురుపులు, మొటిమలు ఉంటే వేపాకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని చల్లార్చి దాంతో తలస్నానం చేయాలి. దీంతో ఇన్ఫెక్షన్లు రావు. అలాగే వేపాకులను పేస్ట్లా చేసి శరీరానికి పట్టించి కాసేపు అయ్యాక స్నానం చేయవచ్చు. ఇలా చేసినా కూడా ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
ఇక చాలా మంది ఇళ్లలో తులసి మొక్క ఉంటుంది. ఇందులో ఎన్నో ఔషధగుణాలు ఉంటాయి. తులసి మనల్ని చర్మ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. తులసి ఆకుల రసాన్నిశరీరానికి అప్లై చేయవచ్చు. దీంతో కురుపులు, మొటిమలు, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. అలాగే చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో కలబంద కూడా పనిచేస్తుంది. కలబంద గుజ్జును కూడా చర్మానికి రాయవచ్చు. దీంతోపాటు తమలపాకులు కూడా చర్మాన్ని సంరక్షించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని పేస్టులా చేసి చర్మానికి రాసుకుంటే ఇన్ఫెక్షన్లు తగ్గడమే కాదు, మొటిమలు, మచ్చల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. ఇలా ఈ నాచురల్ టిప్స్ను పాటించడం ద్వారా వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యల నుంచి సులభంగా బయట పడవచ్చు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవకతవకలు వరుసగా బయటపడుతున్నాయని, తాజాగా రూ.6 వేల కోట్ల విలువైన…
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా…
2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో…
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…