Pulipiri Removal Tips : ప్రస్తుత తరుణంలో పులిపిర్ల సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. వంశపారంపర్య కారణాలతోపాటు థైరాయిడ్, డయాబెటిస్ వంటి వ్యాధులు కూడా పులిపిర్లు వచ్చేందుకు కారణం అవుతుంటాయి. శరీరం అంతా అందంగా ఉన్నా పులిపిర్లు ఉంటే మాత్రం అందవిహీనంగా కనిపిస్తారు. దీంతో పులిపిర్లను పోగొట్టుకోవడానికి చాలా మంది ఖరీదైన చికిత్సలను తీసుకుంటారు. అయితే అలా అవసరం లేకుండా పలు చిట్కాలను పాటిస్తే పులిపిర్లను వదిలించుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పులిపిర్లను తగ్గించడంలో వెల్లుల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది. వెల్లుల్లిని మనం నిత్యం వంటల్లో వాడుతుంటాం. అయితే వెల్లుల్లిని మెత్తగా చేసి పులిపిర్లపై రాస్తుండాలి. దీంతో పులిపిర్లు తగ్గుతాయి. అయితే ఇలా రాత్రిపూట చేసి ఉదయం కడిగేస్తే మంచిది. దీంతో సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చు. ఇక పులిపిర్లను తగ్గించేందుకు యాపిల్ సైడర్ వెనిగర్ కూడా ఎంతగానో పనిచేస్తుంది. దీన్ని నేరుగా పులిపిర్లపై రాయవచ్చు. ఇందుకు గాను ఒక పాత్రలో యాపిల్ సైడర్ వెనిగర్ను తీసుకుని అందులో కాటన్ బడ్ను ముంచాలి. అనంతరం దాంతో పులిపిరి ఉన్న చోట సుమారుగా 10 నిమిషాలు అలాగే ఉంచాలి. ఇలా రెగ్యులర్గా చేస్తుంటు సమస్య నుంచి బయట పడవచ్చు.
టీ ట్రీ ఆయిల్ను కూడా పులిపిర్లను తగ్గించుకోవడంలో ఉపయోగించవచ్చు. ఇది కూడా సమస్య నుంచి బయట పడేలా చేస్తుంది. అలాగే కలబంద గుజ్జును ఉపయోగించవచ్చు. ఇందులో ఉండే మాలిక్ యాసిడ్ పులిపిర్లను తొలగిస్తుంది. దీంతోపాటు ఆముదం, బేకింగ్ సోడా మిశ్రమం లేదా అరటి పండు తొక్కతో కూడా పులిపిర్ల సమస్య నుంచి బయట పడవచ్చు. అయితే ఇవి ప్రయత్నించినా పులిపిర్ల సమస్య తగ్గకపోతే డాక్టర్ను సంప్రదించాల్సి ఉంటుంది. దీంతో సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవకతవకలు వరుసగా బయటపడుతున్నాయని, తాజాగా రూ.6 వేల కోట్ల విలువైన…
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా…
2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో…
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…