Exercises For Eye Sight : కంటి చూపును మెరుగు పరుచుకోవాలంటే.. సహజంగానే ఎవరైనా సరే.. విటమిన్ ఎ ఉన్న ఆహారాలను అధికంగా తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. అయితే దాంతోపాటు త్రాటక అనే ఓ యోగా ప్రక్రియ కూడా మనకు అందుబాటులో ఉంది. నిజానికి ఇది ఒక వ్యాయామం. దీంతో మన కంటి చూపు మెరుగుపడుతుంది. అయితే దీన్ని ఎలా చేయాలో, దాంతో మనకు ఇంకా ఏమేం ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. అరచేతి సైజులో ఉండే ఒక ఆకుని తీసుకుని అందులో నల్లని వృత్తాన్ని గీయాలి. అనంతరం ఆ ఆకును గోడకు అతికించాలి. దాని ఎదురుగా 2 అడుగుల దూరంలో కూర్చుని అదే ఆకును 5 నుంచి 10 నిమిషాల పాటు తీక్షణంగా చూడాలి. ఈ వ్యాయామాన్ని ఉదయం, సాయంత్రం చేయాలి. అయితే ఆకును చూసే సమయంలో కళ్లను ఆర్పకూడదు. తెరిచే ఉంచాలి.
చీకటి గదిలో ఒక క్యాండిల్ను వెలిగించి దానిపైపే కన్నార్పకుండా 5 నుంచి 10 నిమిషాల పాటు చూడాలి. ఈ వ్యాయామాన్ని కూడా నిత్యం ఉదయం, సాయంత్రం చేయాలి. కళ్లు తెరిచి చూసినా ఏమీ కనిపించని చీకటి గదిలో 5 నుంచి 10 నిమిషాల పాటు ఉండాలి. కళ్లు తెరిచే చీకటిని గమనించాలి. కన్నార్పకూడదు. ఈ వ్యాయామాన్ని నిత్యం ఒక్కసారి చేస్తే చాలు. పచ్చని ప్రకృతిలో కూర్చుని నీలంగా ఉన్న ఆకాశం వైపు కన్నార్పకుండా 5 నుంచి 10 నిమిషాల పాటు చూడాలి. ఈ వ్యాయామాన్ని నిత్యం ఒక్కసారి చేయాలి.
మీకు నచ్చిన వ్యక్తులు లేదా మీకిష్టమైన దేవుడు/దేవత ఫొటోగానీ, ఏదైనా ఒక క్రిస్టల్, పెద్దదైన పువ్వు లేదా సూదిలోకి దారం ఎక్కించే మొనను గానీ తదేకంగా 5 నుంచి 10 నిమిషాల పాటు నిత్యం చూడాలి. ఆ వస్తువుకు, మీకు మధ్య 2 అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి. వాటిని చూసేటప్పుడు కన్నార్పకూడదు. ఈ వ్యాయామాన్ని కూడా నిత్యం ఒక్కసారి చేస్తే చాలు. ఇప్పుడు చెప్పిన విధంగా వ్యాయామాలు చేయడం వల్ల కంటి చూపు పెరుగుతుంది. ఏకాగ్రత అలవడుతుంది. ఏదైనా పనిచేసేటప్పుడు కావల్సిన ఏకాగ్రత లభిస్తుంది. నిద్రలేమి సమస్య దూరమవుతుంది. చిన్నారుల్లో జ్ఞాపకశక్తి, గ్రహణశక్తి పెరుగుతాయి.
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…
విటమిన్లు A, C, Eతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడే పపైన్ ఎంజైమ్తో బొప్పాయి ఎన్నో ఏళ్లుగా…
భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర నటుల మధ్య అల్లు అర్జున్ ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటున్నారు. పారితోషిక విషయంలో ఇతర తెలుగు…
టెలికాం దిగ్గజం జియో కుటుంబ వినియోగదారుల కోసం బడ్జెట్కు అనుకూలమైన కొత్త పోస్ట్పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.449…
2023లో జపాన్కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ అనాన్ కవర్పై రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి దర్శనమిచ్చినప్పుడు అది తెలుగు…
హర్యానాలోని పానిపట్ రిఫైనరీ & పెట్రోకెమికల్ కాంప్లెక్స్లో అప్రెంటిస్ నియామకాలకు Indian Oil Corporation Limited (IOCL) కొత్త నోటిఫికేషన్…
మారుతి దర్శకత్వంలో ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ది రాజా సాబ్…