Mouli Daram : ఎరుపు, పసుపు, నారింజ రంగులు కలిపి ఒకే తాడులో ఉండే దారం గురించి మీకు తెలుసు కదా. అదేనండీ.. పూజలు, వ్రతాలు చేసినప్పుడు, శుభ కార్యాలప్పుడు చేతులకు కడతారు కదా. ఇక దేవాలయాల్లో కల్యాణాల వంటివి చేయించినప్పుడు కూడా పూజారులు చేతులకు కడతారు, అవే దారాలు. అవును, ఆ దారాన్నే మౌళి అంటారు. అందులో ఎరుపు, పసుపు, నారింజ రంగులు కలిపి ఒకదాని తరువాత ఒకటి ఉంటాయి. అయితే నిజానికి అసలు ఆ దారం కట్టడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో తెలుసా..? దాన్ని ఎందుకు కడతారో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీమహావిష్ణువు అవతారాల్లో ఒకటైన వామనావతారం గురించి తెలుసు కదా. బలి చక్రవర్తి వద్దకు ఆయన వచ్చి వరం కోరుకుంటాడు. మూడడుగుల స్థలం కావాలని అడగ్గానే వామనుడు ఒక అడుగును భూమిపై, మరో అడుగుపై ఆకాశంపై పెడతాడు. ఇక మూడో అడుగు ఎక్కడ పెట్టాలి అని వామనుడు అడిగితే అప్పుడు బలి ఏ మాత్రం సందేహించకుండా తన నెత్తిన పెట్టమంటాడు. దీంతో వామనుడు తన కాలిని బలి నెత్తిన పెట్టగానే అతను పాతాళంలోకి పోతాడు. దీంతో బలి దాన గుణానికి మెచ్చిన వామనుడు బలికి మృత్యుంజయుడిగా ఉండేలా వరం ఇస్తూ పైన చెప్పిన ఆ మౌళి అనే దారాన్ని కడతాడట. అందుకని అప్పటి నుంచి దాన్ని చేతులకు కడుతూ వస్తున్నారు.
అలా మౌళి దారం కడితే ఎవరికైనా కీడు జరగదట. మృత్యువు అంత త్వరగా సమీపించదట. ఎక్కువ కాలం సుఖంగా బతుకుతారట. సాక్షాత్తూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, వారి భార్యలైన సరస్వతి, లక్ష్మి, పార్వతిలు అండగా ఉంటారట. ఏ కష్టాలను రానివ్వరట. అందుకనే మౌళి దారాలను కడతారు. ఇదీ.. ఆ దారం కట్టడం వెనుక ఉన్న ఉద్దేశం. ఇక అవే రంగులు ఎందుకంటే.. ఆ మూడు రంగులు నవగ్రహాల్లో మూడింటిని ప్రతిబింబిస్తాయి. అవి బృహస్పతి, కుజుడు, సూర్యుడు. వీరు వ్యక్తుల ఐశ్వర్యానికి, సుఖానికి, విద్యకు, ఆరోగ్యానికి కారకులట. అందుకని ఆ గ్రహ పీడ ఉండొద్దనే ఉద్దేశంతో ఆ రంగులతో ఉన్న మౌళి దారాన్ని కడతారు. ఇక దీన్ని మగవారికి కుడి చేతికి కడతారు. ఆడవారికి ఎడమ చేతికి కడతారు. పెళ్లి కాని ఆడవారైతే వారికి కూడా కుడి చేతికే కడతారు.
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…
విటమిన్లు A, C, Eతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడే పపైన్ ఎంజైమ్తో బొప్పాయి ఎన్నో ఏళ్లుగా…
భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర నటుల మధ్య అల్లు అర్జున్ ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటున్నారు. పారితోషిక విషయంలో ఇతర తెలుగు…
టెలికాం దిగ్గజం జియో కుటుంబ వినియోగదారుల కోసం బడ్జెట్కు అనుకూలమైన కొత్త పోస్ట్పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.449…
2023లో జపాన్కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ అనాన్ కవర్పై రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి దర్శనమిచ్చినప్పుడు అది తెలుగు…
హర్యానాలోని పానిపట్ రిఫైనరీ & పెట్రోకెమికల్ కాంప్లెక్స్లో అప్రెంటిస్ నియామకాలకు Indian Oil Corporation Limited (IOCL) కొత్త నోటిఫికేషన్…
మారుతి దర్శకత్వంలో ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ది రాజా సాబ్…