Mouli Daram : ఎరుపు, పసుపు, నారింజ రంగులు కలిపి ఒకే తాడులో ఉండే దారం గురించి మీకు తెలుసు కదా. అదేనండీ.. పూజలు, వ్రతాలు చేసినప్పుడు, శుభ కార్యాలప్పుడు చేతులకు కడతారు కదా. ఇక దేవాలయాల్లో కల్యాణాల వంటివి చేయించినప్పుడు కూడా పూజారులు చేతులకు కడతారు, అవే దారాలు. అవును, ఆ దారాన్నే మౌళి అంటారు. అందులో ఎరుపు, పసుపు, నారింజ రంగులు కలిపి ఒకదాని తరువాత ఒకటి ఉంటాయి. అయితే నిజానికి అసలు ఆ దారం కట్టడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో తెలుసా..? దాన్ని ఎందుకు కడతారో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీమహావిష్ణువు అవతారాల్లో ఒకటైన వామనావతారం గురించి తెలుసు కదా. బలి చక్రవర్తి వద్దకు ఆయన వచ్చి వరం కోరుకుంటాడు. మూడడుగుల స్థలం కావాలని అడగ్గానే వామనుడు ఒక అడుగును భూమిపై, మరో అడుగుపై ఆకాశంపై పెడతాడు. ఇక మూడో అడుగు ఎక్కడ పెట్టాలి అని వామనుడు అడిగితే అప్పుడు బలి ఏ మాత్రం సందేహించకుండా తన నెత్తిన పెట్టమంటాడు. దీంతో వామనుడు తన కాలిని బలి నెత్తిన పెట్టగానే అతను పాతాళంలోకి పోతాడు. దీంతో బలి దాన గుణానికి మెచ్చిన వామనుడు బలికి మృత్యుంజయుడిగా ఉండేలా వరం ఇస్తూ పైన చెప్పిన ఆ మౌళి అనే దారాన్ని కడతాడట. అందుకని అప్పటి నుంచి దాన్ని చేతులకు కడుతూ వస్తున్నారు.
అలా మౌళి దారం కడితే ఎవరికైనా కీడు జరగదట. మృత్యువు అంత త్వరగా సమీపించదట. ఎక్కువ కాలం సుఖంగా బతుకుతారట. సాక్షాత్తూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, వారి భార్యలైన సరస్వతి, లక్ష్మి, పార్వతిలు అండగా ఉంటారట. ఏ కష్టాలను రానివ్వరట. అందుకనే మౌళి దారాలను కడతారు. ఇదీ.. ఆ దారం కట్టడం వెనుక ఉన్న ఉద్దేశం. ఇక అవే రంగులు ఎందుకంటే.. ఆ మూడు రంగులు నవగ్రహాల్లో మూడింటిని ప్రతిబింబిస్తాయి. అవి బృహస్పతి, కుజుడు, సూర్యుడు. వీరు వ్యక్తుల ఐశ్వర్యానికి, సుఖానికి, విద్యకు, ఆరోగ్యానికి కారకులట. అందుకని ఆ గ్రహ పీడ ఉండొద్దనే ఉద్దేశంతో ఆ రంగులతో ఉన్న మౌళి దారాన్ని కడతారు. ఇక దీన్ని మగవారికి కుడి చేతికి కడతారు. ఆడవారికి ఎడమ చేతికి కడతారు. పెళ్లి కాని ఆడవారైతే వారికి కూడా కుడి చేతికే కడతారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్ను ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…