Egg Masala Paratha : కోడిగుడ్లతో మనం అనేక రకాల వెరైటీ వంటకాలను చేసుకుని తినవచ్చు. వాటితో ఏ వంటకం చేసుకుని తిన్నా రుచిగానే ఉంటుంది. అయితే కోడిగుడ్లతో పరాటాలు కూడా చేసుకోవచ్చు తెలుసా.. మసాలా ఎగ్ పరాటా చేసుకుని తింటే అవి ఎంతో రుచిగా ఉంటాయి. మరి మసాలా ఎగ్ పరాటాను ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
మసాలా ఎగ్ పరాటా తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడకబెట్టిన కోడిగుడ్లు – 4, మిరియాల పొడి – 1 టీస్పూన్, కొత్తిమీర తురుము – 1/2 కప్పు, గోధుమపిండి – 1/4 కిలో, నూనె లేదా నెయ్యి – తగినంత.
మసాలా ఎగ్ పరాటా తయారు చేసే విధానం..
ముందుగా ఉడకబెట్టిన కోడిగుడ్లను తీసుకుని ఒక గిన్నెలో వాటిని సన్నగా కట్ చేసుకోవాలి. అందులోనే మిరియాల పొడి, కొత్తిమీర తురుము, ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. ఒక గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, తగినన్ని నీళ్లు పోసి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తరువాత పిండి ముద్దను చిన్న చిన్న ఉండల్లా చేసుకుని ఒక్కోదాన్ని చిన్న చిన్న చపాతీల్లా వత్తుకోవాలి. తరువాత అందులో కోడిగుడ్ల మిశ్రమాన్ని పెట్టి అంచులు మూయాలి. అనంతరం మళ్లీ వాటిని చపాతీల్లా వత్తుకోవాలి. ఆ తరువాత పెనం మీద నెయ్యి లేదా వెన్న లేదా నూనె వేస్తూ వాటిని రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే.. రుచికరమైన మసాలా ఎగ్ పరాటా తయారవుతుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…