Silver Anklets : మహిళలు పాదాలకు పట్టీలు ధరించడం అన్నది మన భారతీయ సంప్రదాయాల్లో ఒకటి. మన దేశంలో ఉన్న చాలా వర్గాలకు చెందిన మహిళలు కాళ్లకు పట్టీలను ధరిస్తారు. అయితే ఆ పట్టీలు వెండితో చేసినవే అయి ఉంటాయి. మహిళలు వివాహం చేసుకున్న సందర్భంలో కాలివేళ్లకు మెట్టెలు తొడుగుతారు. అదే పట్టీలు అయితే ఆడపిల్ల పుట్టగానే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే వారి పాదాలకు పట్టీలను తొడుగుతారు. పట్టీలు తొడుక్కుని ఆడపిల్లలు ఇంట్లో సందడిగా తిరుగుతుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువుంటుందని పండితులు చెబుతారు. అయితే పట్టీలను ఏ మహిళ అయినా సరే.. వెండి లోహంతో చేసినవే ధరించాలి. కానీ నేటి తరుణంలో చాలా మంది బంగారంతో చేసిన పట్టీలను తొడుగుతున్నారు. నిజానికి ఇలా చేయడం సరికాదు. ఇందుకు శాస్త్రీయంగానే కాదు, పురాణాల పరంగా కూడా కారణాలు ఉన్నాయి. అవేమిటంటే..
సాధారణంగా హిందూ పురాణాల ప్రకారం.. బంగారం అంటే సాక్షాత్తూ లక్ష్మీదేవి అనే చెబుతారు. అలాగే లక్ష్మీదేవికి పసుపు రంగు అంటే చాలా ఇష్టమట. ఈ క్రమంలో బంగారం కూడా పసుపు రంగులో ఉంటుంది కనుక.. ఆ రంగులో వస్తువులు ఏవైనా సరే.. ఆఖరికి పట్టీలు అయినా సరే.. పాదాలకు ధరించకూడదు. ఇక ఈ విషయంలో సైన్స్ చెబుతున్నదేమిటంటే..
వెండి మన శరీరానికి చలువ చేస్తుంది. వెండి వస్తువులు ధరిస్తే శరీరంలో ఉన్న వేడి బయటకు పోతుంది. కనుక పాదాలకు ఎప్పుడూ వెండితో తయారు చేసిన ఆభరణాలనే ధరించాలి. అదే బంగారం అయితే ఒంట్లో వేడి పెరుగుతుంది. కనుక బంగారంతో చేసిన పట్టీలను వేసుకోరాదు. అయితే వెండితో చేసిన పట్టీలను ధరిస్తే నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు పోతాయట. అందుకోసమైనా మహిళలు వెండితో చేసిన పట్టీలను ధరించాల్సిందే.
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…