Fish Biryani : చేపలతో వేపుడు, పులుసు, కూర ఎవరైనా చేసుకుని తింటారు. అయితే చికెన్, మటన్ లాగే చేపలతో కూడా బిర్యానీ వండుకుని తినవచ్చు. కొంత శ్రమ, కాసింత ఓపిక ఉండాలే కానీ ఘుమ ఘుమలాడే చేపల బిర్యానీ చేసేందుకు ఎంతో సమయం పట్టదు. పైగా ఆ బిర్యానీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి చేప బిర్యానీని ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
చేప బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
చేప ముక్కలు – 1/2 కిలో, షాజీరా – 1 టీస్పూన్, బాస్మతి బియ్యం – 4 కప్పులు, ఉల్లి పాయలు – 1/4 కిలో, పచ్చి మిర్చి – 12, పుదీనా – 1 కట్ట, కొత్తిమీర – 1 కట్ట, కారం – 1 టీస్పూన్, పసుపు – 1/4 టీస్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – వేయించడానికి సరిపడా, మిరియాల పొడి – 1 టీస్పూన్, నెయ్యి – 50 గ్రాములు, గరం మసాలా – 1/2 టేబుల్ స్పూన్, పెరుగు – 1 కప్పు, నిమ్మరసం – 3 టేబుల్ స్పూన్లు, కుంకుమ పువ్వు – కొద్దిగా (నాలుగు టేబుల్ స్పూన్ల గోరువెచ్చని పాలలో నానబెట్టాలి), అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు.
చేప బిర్యానీ తయారుచేసే విధానం..
ఒక పాన్ లేదా మందంగా ఉన్న గిన్నె తీసుకుని అందులో ముందుగా నెయ్యి వేయాలి. అనంతరం అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, నిలువుగా చీరిన 4 లేదా 5 పచ్చి మిరపకాయలు, కొద్దిగా పుదీనా ఆకులు, ఉప్పు, గరం మసాలా వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత బాస్మతి బియ్యం వేసి తగినన్ని నీళ్లు పోసి సగం ఉడికించాలి. కడిగిన చేప ముక్కలకు కొద్దిగా నిమ్మరసం, కారం, పసుపు, పెరుగు, ఉప్పు బాగా పట్టించాలి. అనంతరం కళాయిలో 1 టీస్పూన్ నూనె వేసి మిగిలిన వాటిలో నుంచి సగం పచ్చి మిరపకాయలు, సగం పుదీనా ఆకులు, కొత్తిమీర తురుం వేసి 2 నిమిషాలు బాగా వేయించాలి. అనంతరం చల్లారనివ్వాలి.
ఆ తరువాత ముద్దగా చేసుకుని మిరియాల పొడితో సహా చేప ముక్కలకు ఆ మిశ్రమాన్ని బాగా పట్టించాలి. కళాయిలో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అనంతరం పొడవుగా చీల్చిన మిగిలిన పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర తురుం కూడా వేసి బాగా వేయించి తీసి పక్కన పెట్టాలి. మందంగా ఉండే గిన్నెలో ఒక టీస్పూన్ నూనె వేసి అన్నీ పట్టించి ఉంచుకున్న చేప ముక్కల మిశ్రమాన్ని పరిచి దాని మీద ఉల్లిముక్కల మిశ్రమాన్ని చల్లి నిమ్మరసం పిండాలి. వాటి మీద సగం ఉడికించిన అన్నం వేసి అనంతరం ఒక టీస్పూన్ వేడి నూనె, టీస్పూన్ నెయ్యి చల్లుకోవాలి. వాటి మీద కుంకుమ పువ్వు కలిపిన పాలు పోసి మూత పెట్టి సిమ్లో 25 నిమషాల పాటు ఉడికించాలి. అంతే.. ఘుమ ఘుమలాడే వేడి వేడి చేప బిర్యానీ రెడీ అవుతుంది.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…