స్వయం ఉపాధి మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే ఆలోచన ఉంటే చాలు. దాంతో ఎంతటి వారైనా ఏమైనా సాధించవచ్చు. కొద్దిగా కష్టపడుతూ ఓపిగ్గా, మెళకువగా వ్యాపారం చేస్తే ఎవరైనా సక్సెస్ సాధిస్తారు. సరిగ్గా ఇవే విషయాలను అలవర్చుకున్నాడు. కనుకనే అతను పలు మార్లు ఫెయిల్ అయినా.. చివరకు వినూత్న ఐడియాతో ఏటా రూ.కోట్లు సంపాదిస్తున్నాడు. అతనే కేశవ్ రాయ్.
కేశవ్ రాయ్ స్కూల్లో యావరేజ్ స్టూడెంటే. కానీ సొంతంగా ఏదైనా చేయాలని, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విపరీతంగా ఆలోచించాడు. దీంతో అతనికి సెమీ ఆటోమేటిక్ బైక్ కవర్లను తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. అందులో భాగంగానే 2016లో అతను బైక్ బ్లేజర్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. 2017లో తన ప్రొడక్ట్ కు పేటెంట్ పొందాడు. తరువాత అతను వెనక్కి తిరిగి చూడలేదు. దిన దిన ప్రవర్థమానం అన్నట్లు ఎదిగాడు.
కేశవ్ రాయ్ సొంతంగా తయారు చేసిన సెమీ ఆటోమేటిక్ బైక్ కవర్ ద్విచక్రవాహనదారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దాన్ని వాహనానికి అమర్చితే చాలు 30 నిమిషాల్లో కవర్ అవుతుంది. దీంతో వర్షం పడినా ఏమీ కాదు. వాహనం పొడిగా ఉంటుంది. ఈ సెమీ ఆటోమేటిక్ బైక్ కవర్లను రూ.780, రూ.850 ధరలకు కొనుగోలు చేయవచ్చు. అన్ని ఈ-కామర్స్ సైట్లలోనూ ఈ కవర్స్ అందుబాటులో ఉన్నాయి.
కేశవ్ రాయ్ మొదట్లో తన బైక్ కవర్లను అమ్మేందుకు కొంత కష్టపడ్డాడు. కానీ వాటి గురించి తెలిశాక చాలా మంది వాటిని కొనడం మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో వాటి గురించి అతను విస్తృతంగా ప్రచారం చేశాడు. దీంతో తక్కువ సమయంలోనే ఆ బైక్ కవర్లకు ఆదరణ లభించింది. ఇక 5 ఏళ్ల కాలంలో అతను 75వేలకు పైగా అలాంటి కవర్లను విక్రయించగా.. ప్రస్తుతం అతనికి ఏడాదికి రూ.1.30 కోట్ల టర్నోవర్ వస్తోంది.
కేశవ్ రాయ్కు చెందిన బైక్ బ్లేజర్ పరిశ్రమ మొదట తన ఇంటి టెర్రేస్పై ప్రారంభమైంది. ఇప్పుడు ఢిల్లీ, ఘజియాబాద్లలో రెండు పరిశ్రమలను ఏర్పాటు చేసి అతను ఆ బైక్ కవర్లను ఉత్పత్తి చేస్తున్నాడు. త్వరలో మరిన్ని ప్రాంతాల్లో తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేస్తానని చెబుతున్నాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…