స్వయం ఉపాధి మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే ఆలోచన ఉంటే చాలు. దాంతో ఎంతటి వారైనా ఏమైనా సాధించవచ్చు. కొద్దిగా కష్టపడుతూ ఓపిగ్గా, మెళకువగా వ్యాపారం చేస్తే ఎవరైనా సక్సెస్ సాధిస్తారు. సరిగ్గా ఇవే విషయాలను అలవర్చుకున్నాడు. కనుకనే అతను పలు మార్లు ఫెయిల్ అయినా.. చివరకు వినూత్న ఐడియాతో ఏటా రూ.కోట్లు సంపాదిస్తున్నాడు. అతనే కేశవ్ రాయ్.
కేశవ్ రాయ్ స్కూల్లో యావరేజ్ స్టూడెంటే. కానీ సొంతంగా ఏదైనా చేయాలని, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విపరీతంగా ఆలోచించాడు. దీంతో అతనికి సెమీ ఆటోమేటిక్ బైక్ కవర్లను తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. అందులో భాగంగానే 2016లో అతను బైక్ బ్లేజర్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. 2017లో తన ప్రొడక్ట్ కు పేటెంట్ పొందాడు. తరువాత అతను వెనక్కి తిరిగి చూడలేదు. దిన దిన ప్రవర్థమానం అన్నట్లు ఎదిగాడు.
కేశవ్ రాయ్ సొంతంగా తయారు చేసిన సెమీ ఆటోమేటిక్ బైక్ కవర్ ద్విచక్రవాహనదారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దాన్ని వాహనానికి అమర్చితే చాలు 30 నిమిషాల్లో కవర్ అవుతుంది. దీంతో వర్షం పడినా ఏమీ కాదు. వాహనం పొడిగా ఉంటుంది. ఈ సెమీ ఆటోమేటిక్ బైక్ కవర్లను రూ.780, రూ.850 ధరలకు కొనుగోలు చేయవచ్చు. అన్ని ఈ-కామర్స్ సైట్లలోనూ ఈ కవర్స్ అందుబాటులో ఉన్నాయి.
కేశవ్ రాయ్ మొదట్లో తన బైక్ కవర్లను అమ్మేందుకు కొంత కష్టపడ్డాడు. కానీ వాటి గురించి తెలిశాక చాలా మంది వాటిని కొనడం మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో వాటి గురించి అతను విస్తృతంగా ప్రచారం చేశాడు. దీంతో తక్కువ సమయంలోనే ఆ బైక్ కవర్లకు ఆదరణ లభించింది. ఇక 5 ఏళ్ల కాలంలో అతను 75వేలకు పైగా అలాంటి కవర్లను విక్రయించగా.. ప్రస్తుతం అతనికి ఏడాదికి రూ.1.30 కోట్ల టర్నోవర్ వస్తోంది.
కేశవ్ రాయ్కు చెందిన బైక్ బ్లేజర్ పరిశ్రమ మొదట తన ఇంటి టెర్రేస్పై ప్రారంభమైంది. ఇప్పుడు ఢిల్లీ, ఘజియాబాద్లలో రెండు పరిశ్రమలను ఏర్పాటు చేసి అతను ఆ బైక్ కవర్లను ఉత్పత్తి చేస్తున్నాడు. త్వరలో మరిన్ని ప్రాంతాల్లో తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేస్తానని చెబుతున్నాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…