కరోనా వల్ల చాలా మంది ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోయారు. దీంతో ప్రస్తుత తరుణంలో చాలా మందికి పూట గడవడం కష్టంగా మారింది. ఆర్థిక సమస్యలు సరే సరి. చిన్న పని కూడా దొరకని పరిస్థితి నెలకొంది. అయితే ఏదైనా చిన్నగా వ్యాపారం చేయాలనుకునే వారు డబ్బులు లేకపోతే చింతించాల్సిన పనిలేదు. కింద తెలిపిన 6 ప్రభుత్వ పథకాల ద్వారా సులభంగా రుణాలను పొందవచ్చు. మరి ఆ పథకాలు ఏమిటంటే..
ఈ పథకం కింద కనీసం రూ.10 లక్షల నుంచి గరిష్టంగా రూ.25 లక్షల వరకు రుణం ఇస్తారు. MSME లకు ఈ రుణ సహాయం అందజేస్తారు. తీసుకున్న రుణానికి 36 నెలల వరకు మారటోరియం సౌకర్యం లభిస్తుంది. 10 ఏళ్ల లోపు రుణాన్ని చెల్లించాలి.
సూక్ష్మ, చిన్న తరహా వ్యాపారులకు ఈ పథకం కింద రుణం వస్తుంది. దీని కింద గరిష్టంగా రూ.2 కోట్ల వరకు రుణం పొందవచ్చు. లబ్దిదారులు 15 శాతం మొత్తంతో వ్యాపారం ప్రారంభిస్తే 85 శాతం మేర డబ్బును రుణం కింద ఇస్తారు.
ఈ స్కీమ్ చిరు వ్యాపారుల కోసం ఉద్దేశించబడింది. దీని కింద రూ.10వేల రుణం ఇస్తారు. ఏడాది లోగా చెల్లించాలి.
ఇందులో 3 రకాల విభాగాల్లో లోన్లు ఇస్తారు. శిశు విభాగం కింద రూ.50వేల లోపు వరకు రుణాలను ఇస్తారు. కిశోర్ విభాగం కింద రూ.50వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణాన్ని ఇస్తారు. తరుణ్ విభాగం కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణం ఇస్తారు. అనేక బ్యాంకులు ఈ రుణాలను అందిస్తున్నాయి. బ్యాంకులను బట్టి వడ్డీ రేట్లు మారుతాయి.
ఈ పథకంలో భాగంగా రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి వరకు రుణాలను ఇస్తారు. అయితే ఈ స్కీమ్ కింద రుణం పొంది వ్యాపారం ప్రారంభిస్తే అందులో భాగస్వాములుగా ఎస్సీ, ఎస్టీ విభాగాలకు చెందిన వారు ఉండాలి. వారి వాటా 51 శాతంగా ఉండాలి. లోన్ తీసుకున్నాక 7 ఏళ్ల లోపు చెల్లించాలి. అప్పటికి ఇంకా ఏమైనా బాకీ ఉంటే అదనంగా మరో 18 నెలల పాటు రుణాన్ని చెల్లించే కాలాన్ని పొడిగిస్తారు.
ఈ స్కీమ్ కింద 18 నుంచి 35 ఏళ్ల లోపు వయస్సు వారు రుణం కోసం దరఖాస్తు చేయవచ్చు. ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, ఎక్స్ సర్వీస్మెన్, అంగ వైకల్యం ఉన్నవారికి అయితే 45 ఏళ్ల వరకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఇనిస్టిట్యూట్లో ఏదైనా విభాగంలో ట్రేడ్ సర్టిఫికెట్ కోర్సును కనీసం 6 నెలల పాటు అయినా చేసి ఉండాలి. ఏడాది ఆదాయం రూ.40వేలు మించరాదు. వీరికి రూ.10 లక్షల వరకు రుణం లభిస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…