మొబైల్స్ తయారీదారు రియల్మి కొత్తగా రియల్మి 8ఎస్ 5జి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. ఇందులో 6.5 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన ఎల్సీడీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. అందువల్ల డిస్ప్లే క్వాలిటీగా ఉంటుంది.
ఈ ఫోన్లో మీడియాటెక్కు చెందిన డైమెన్సిటీ 810 ప్రాసెసర్ను అమర్చారు. అందువల్ల 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. 6/8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్లో ఈ ఫోన్ విడుదలైంది. మెమొరీని కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకోవచ్చు. ఇక ఈ ఫోన్లో అదనపు ర్యామ్ను మరో 5జీబీ వరకు వేసుకోవచ్చు. అందుకు అవకాశం కల్పించారు.
ఈ ఫోన్లో వెనుక వైపు 64 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరా ఉండగా, దీనికి తోడు మరో 2 మెగాపిక్సల్ బ్లాక్ అండ్ వైట్ కెమెరా, 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాలను ఏర్పాటు చేశారు. ముందు వైపు 16 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఈ ఫోన్లో డ్యుయల్ సిమ్లను వేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ లభిస్తుంది.
ఫింగర్ ప్రింట్ సెన్సార్ను ఈ ఫోన్లో పక్క వైపున ఏర్పాటు చేశారు. 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్ సి ఫీచర్లను ఇందులో అందిస్తున్నారు. ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తోంది.
రియల్మి 8ఎస్ 5జి స్మార్ట్ ఫోన్కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.17,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.19,999గా ఉంది. ఈ ఫోన్ను సెప్టెంబర్ 13వ తేదీ నుంచి విక్రయిస్తారు. రియల్మి ఆన్ లైన్ స్టోర్తోపాటు ఫ్లిప్కార్ట్లో, ఇతర ఆఫ్లైన్ స్టోర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ కార్డులతో రూ.1500 డిస్కౌంట్ పొందవచ్చు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…